
జయ మృతి పట్ల ఏపీ పీసీసీ సంతాపం
జయలలిత మృతిపట్ల పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు.
అమరావతి: తమిళనాడు సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతిపట్ల పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో పీసీసీ నేతలతో మంగళవారం సమావేశమైన ఆయన తొలుత జయలలిత మృతికి కొంతసేపు మౌనం పాటించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో ఎన్ని ఇబ్బందులున్నా మహిళలు అధిగమించగలరని నిరూపించిన మహిళానేత జయలలిత అన్నారు.
ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో ఆమెను ఐసీయూకు షిఫ్ట్ చేసి వైద్యులు చికిత్స అందిస్తుండగా.. సోమవారం రాత్రి దాదాపు 11:30 గంటల సమయంలో జయలలిత కన్నుమూసిన విషయం తెలిసిందే. జయలలిత అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం చెన్నై మెరీనా బీచ్లో ఎంజీఆర్ సమాధి పక్కనే నిర్వహిస్తున్నారు.