'భూములు వేలం వేసే హక్కు ఏపీ సర్కార్‌కు లేదు' | AP govt has no right to auction lands of Sadavarthi sathram | Sakshi
Sakshi News home page

'భూములు వేలం వేసే హక్కు ఏపీ సర్కార్‌కు లేదు'

Aug 25 2016 12:20 PM | Updated on Aug 18 2018 8:08 PM

సదావర్తి సత్రం భూములను వేలం వేసే హక్కు ఏపీ ప్రభుత్వానికి లేదని సూరిబాబు అన్నారు.

విజయవాడ: సదావర్తి సత్రం భూములను వేలం వేసే హక్కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి లేదని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సూరిబాబు అన్నారు. గురువారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. సదావర్తి సత్రం భూములపై మద్రాస్‌ హైకోర్టులో కేసు నడుస్తుందని చెప్పారు.

ఓ పక్క కేసు నడుస్తుండగా.. ప్రభుత్వం టీడీపీ నేతలకు కట్టబెట్టడం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. రూ. 10 కోట్లు విలువ చేసే భూమిని రూ. 27 లక్షలకే కట్టబెట్టడంపై మండిపడ్డారు. దీని వెనుక వందల కోట్లు చేతులు మారాయని సూరిబాబు ఆరోపించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement