లాడ్జీలో గుర్తుతెలియని వ్యక్తి మృతి | An Unidentified Dead body Found in Lodge | Sakshi
Sakshi News home page

లాడ్జీలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

Oct 7 2016 10:46 PM | Updated on Sep 4 2017 4:32 PM

లాడ్జీలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

లాడ్జీలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

స్థానిక శివాలయం వీధిలోని ఓ లాడ్జిలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో అతను లాడ్జీలో మంచం తీసుకొని నిద్రపోయాడని, మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చూడగా మంచంలోనే చనిపోయినట్లు లాడ్జీ నిర్వాహకులు చెబుతున్నారు.

 ప్రొద్దుటూరు క్రైం: స్థానిక శివాలయం వీధిలోని ఓ లాడ్జిలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో అతను లాడ్జీలో మంచం తీసుకొని నిద్రపోయాడని, మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చూడగా మంచంలోనే చనిపోయినట్లు లాడ్జీ నిర్వాహకులు చెబుతున్నారు. లాడ్జీ రిజిష్టర్‌లో అతని పేరు వెంకటరమణ, ఈశ్వరరెడ్డినగర్‌ అని చెప్పినట్లు వారు తెలిపారు. టూ టౌన్‌ ఎస్‌ఐ మంజునాథరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రిజిష్టర్‌లో రాసి ఉన్న చిరునామా ఆధారంగా పోలీసులు ఈశ్వరరెడ్డినగర్‌కు వెళ్లి విచారణ చేయగా, అతనికి సంబంధించిన ఆధారాలు లభ్యం కాలేదు. అతను నిత్యం బేల్దారి పనికి వస్తుంటాడని, తనది కర్నూలు జిల్లాలోని నంద్యాల స్వస్థలమని చెప్పేవాడని మరో బేల్దారి చెప్పాడు. ఈ మేరకు మృతదేహాన్ని పోలీసులు మార్చురీకి తరలించారు. ఇతనికి సంబంధించిన బంధువులు టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ మంజునాథరెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement