తులసీరెడ్డి హత్య కేసులో 9 మంది అరెస్ట్ | 9 people arrested in tulasi reddy murder case | Sakshi
Sakshi News home page

తులసీరెడ్డి హత్య కేసులో 9 మంది అరెస్ట్

Apr 13 2016 1:05 PM | Updated on Sep 3 2017 9:51 PM

కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి అనుచరుడు, న్యాయవాది తులసీరెడ్డి హత్య కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు.

కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి అనుచరుడు, న్యాయవాది తులసీరెడ్డి హత్య కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 29వ తేదీన నంద్యాల పట్టణంలో శిల్పా మోహన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, న్యాయవాది తులసిరెడ్డిపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి.. ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆయన పరిస్థితి విషమంగా మారడంతో ... మెరుగైన వైద్య చికిత్స కోసం  హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ఆయన  హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement