కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి అనుచరుడు, న్యాయవాది తులసీరెడ్డి హత్య కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు.
కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి అనుచరుడు, న్యాయవాది తులసీరెడ్డి హత్య కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 29వ తేదీన నంద్యాల పట్టణంలో శిల్పా మోహన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, న్యాయవాది తులసిరెడ్డిపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి.. ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆయన పరిస్థితి విషమంగా మారడంతో ... మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.