–మునిసిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూలుకు మిగిలింది వారం రోజులే
- ఈ సారైనా లక్ష్యం సాధించేరా?
కార్పొరేషన్ : 1
మునిసిపాలిటీలు : 8
నగర పంచాయతీలు : 3
మొత్తం అసెస్మెంట్లు : 2,42,248
వసూలు చేయాల్సిన ఆస్తి పన్ను : రూ.6,455.54 లక్షలు
ఇప్పటి దాకా వసూలైన మొత్తం : రూ.2,614.91 లక్షలు
వారం వ్యవధిలో వసూలు చేయాల్సిన మొత్తం : రూ.3,840.63 లక్షలు
ధర్మవరం : పట్టణాల్లో ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యం నెరవేరే సూచనలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థలో వసూళ్లు నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలో అనంతపురం కార్పొరేషన్, ధర్మవరం, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, కదిరి, రాయదుర్గం, తాడిపత్రి, కళ్యాణదుర్గం మునిసిపాలిటీలు, మడకశిర, పామిడి, పుట్టపర్తి నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 2016–17 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ.6,455.54 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. గురువారం సాయంత్రం నాటికి రూ.2,614.91 లక్షలు మాత్రమే వసూలు చేయగలిగారు.
40.50 శాతం మాత్రమే వసూళ్లు సాధించి.. పూర్తిగా వెనుకంజలో ఉన్నారు. అనంతపురం నగర పాలక సంస్థలో రూ.2,608.45 లక్షల డిమాండ్ ఉండగా.. రూ.1,140.97 లక్షలు మాత్రమే (43.74 శాతం) వసూలు చేయగలిగారు. ఇక మడకశిర నగర పంచాయతీ కేవలం 12.78 శాతం పన్ను వసూళ్లతో జిల్లాలోనే చివరిస్థానంలో ఉంది. ఎప్పటిలాగే తాడిపత్రి మునిసిపాలిటీ లక్ష్యంలో ఇప్పటికే 65.14 శాతం వసూలు చేసి మరోసారి జిల్లా టాపర్గా నిలిచింది. మున్సిపాలిటీల్లో అత్యధిక అసెస్మెంట్లు కల్గిన హిందూపురం 39.42 శాతం వసూలు సాధించగా, ధర్మవరం 40.69 శాతం మాత్రమే చేయగల్గింది.
తప్పెట మోగించినా పెరగని వసూళ్లు
మొండి బకాయిదారుల నుంచి పన్నులు వసూలు చేసేందుకు కదిరి మునిసిపల్ అధికారులు వినూత్న పద్ధతిని అవలంబించారు. బకాయిదారుల ఇళ్ల ముందు తప్పెట మోగించారు. ఇళ్లు, సంస్థలకు తాళాలు కూడా వేశారు. అయినా మొత్తం లక్ష్యంలో 28.09 శాతం పన్నులు మాత్రమే వసూలు చేయగలిగారు. కదిరి మునిసిపాలిటీ పరిధిలో మొత్తం 20,042 అసెస్మెంట్లకు గాను రూ.510.2 లక్షలు వసూలు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.143.3 లక్షలు మాత్రమే రాబట్టారు. ఇదేవిధంగా జిల్లాలోని చాలా మునిసిపాలిటీలు తమ లక్ష్యంలో సగం కూడా వసూలు చేయలేకపోయాయి.
మిగిలింది వారమే..
పన్నుల వసూలుకు వారం గడువు మాత్రమే ఉంది. జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలలో 2,42,248 అసెస్మెంట్లకు గాను దాదాపు 10 వేల దాకా ప్రభుత్వ కార్యాలయాలకు చెందినవి ఉన్నాయి. ఈ ప్రభుత్వ కార్యాలయాల నుంచి దాదాపు రూ. 10 కోట్ల మేర బకాయిలు రావాలి. పాత బకాయిలపై ప్రభుత్వం వడ్డీమాఫీ ఎత్తివేయడం కూడా వసూళ్లు మందగించడానికి కారణంగా అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఉన్న వారం వ్యవధిలో 80 శాతమైనా వసూళ్లు చేయగలిగితే ఆయా మునిసిపాలిటీలలో అభివృద్ధి పనులు చేపట్టడానికి వీలవుతుంది.
7 రోజులు..38 కోట్లు..
Published Thu, Mar 23 2017 11:46 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement