19 ఎర్రచందనం దుంగలు స్వాధీనం | Sakshi
Sakshi News home page

19 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Published Thu, May 26 2016 8:26 PM

6 red smugglers arrested

బద్వేల్ (వైఎస్సార్‌ జిల్లా) : అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 19 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్‌జిల్లా బద్వేల్ మండలం పెద్దచెరువు సమీపంలో గురువారం చోటుచేసుకుంది. అదుపులోకి తీసుకున్నవారిలో నలుగురు నెల్లూరుకు చెందిన వారు కాగా.. మరో ఇద్దరు కడప జిల్లా వాసులని  పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement