శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డుప్రమాదం | 3 killed in Massive road accident at Srikalahasthi | Sakshi
Sakshi News home page

శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డుప్రమాదం

Aug 15 2016 6:27 AM | Updated on Sep 4 2017 9:24 AM

శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డుప్రమాదం

శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డుప్రమాదం

శ్రీకాళహస్తి సమీపంలోని ల్యాంకో ఫ్యాక్టరీ వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.

చిత్తూరు: శ్రీకాళహస్తి సమీపంలోని ల్యాంకో ఫ్యాక్టరీ వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కర్ణాటకు చెందిన ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, 30 మందికి గాయాలు అయినట్టు తెలిసింది. వినాయక ట్రావెల్స్‌కు చెందిన బస్సు విజయవాడ నుంచి ఒంగోలు మీదుగా బెంగళూరుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిద్రమత్తులో బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా అతివేగంతో బస్సును నడపడంతో అదుపుతప్పి మూడు పల్టీలు కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మృతులంతా కావాలికి చెందినవారిగా పోలీసులు తెలిపారు.

మృతుల్లో మోహన్‌ (45), శ్రీనివాసులు (43), మరో యువతి ఉన్నారు. వినాయక ట్రావెల్స్‌ బస్సు నంబర్‌ కెఏ 01 ఎఎఫ్‌ 4433 గా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించినట్టు సమచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement