breaking news
Lanko factory
-
చిక్కుల్లో ల్యాంకో బబంధ్ పవర్...
సాక్షి, హైదరాబాద్: ల్యాంకో గ్రూపునకు చెందిన మరో కంపెనీ చిక్కుల్లో పడింది. ల్యాంకో బబంధ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఐసీఐసీఐ బ్యాంకు దాఖలు చేసిన పిటిషన్పై హైదరాబాద్లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) సానుకూలంగా స్పందించింది. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.1428 కోట్లను తిరిగి చెల్లించడంలో విఫలమైనందున ల్యాంకో బబంధ్ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియకు (సీఐఆర్పీ) అనుమతినిచ్చింది. ఇందులో భాగంగా తాత్కాలిక దివాలా పరిష్కార ప్రక్రియ నిపుణుడిగా (ఐఆర్పీ) ముంబాయికి చెందిన యు.బాలకృష్ణ భట్ను నియమించింది. ల్యాంకో బబంధ్ ఆస్తుల క్రయ, విక్రయాలపై నిషేధం (మారటోరియం) విధించింది కూడా. ఇప్పటికే ఏవైనా ఆస్తులను తాకట్టుపెట్టి ఉంటే వాటిని విక్రయించడం గానీ, తాకట్టు పెట్టుకున్న వారు ఆ ఆస్తులను సర్ఫేసీ చట్టం కింద అమ్మడం గానీ చేయరాదని స్పష్టంచేసింది. దివాలా ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఈ మారటోరియం కొనసాగుతుందని స్పష్టం చేసింది. దివాలా పరిష్కార ప్రక్రియకు సంబంధించిన వివరాలతో పత్రికా ప్రకటన జారీ చేయాలని ఐసీఐసీఐ బ్యాంక్ను ఆదేశించింది. ఈ మేరకు ఎన్సీఎల్టీ జుడీషియల్ సభ్యులు బిక్కి రవీంద్రబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డుప్రమాదం
చిత్తూరు: శ్రీకాళహస్తి సమీపంలోని ల్యాంకో ఫ్యాక్టరీ వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కర్ణాటకు చెందిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, 30 మందికి గాయాలు అయినట్టు తెలిసింది. వినాయక ట్రావెల్స్కు చెందిన బస్సు విజయవాడ నుంచి ఒంగోలు మీదుగా బెంగళూరుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిద్రమత్తులో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంతో బస్సును నడపడంతో అదుపుతప్పి మూడు పల్టీలు కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మృతులంతా కావాలికి చెందినవారిగా పోలీసులు తెలిపారు. మృతుల్లో మోహన్ (45), శ్రీనివాసులు (43), మరో యువతి ఉన్నారు. వినాయక ట్రావెల్స్ బస్సు నంబర్ కెఏ 01 ఎఎఫ్ 4433 గా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించినట్టు సమచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.