ఇద‍్దరు యువతుల అనుమానాస్పద మృతి | 2young girls died in suspicious | Sakshi
Sakshi News home page

ఇద‍్దరు యువతుల అనుమానాస్పద మృతి

Jun 4 2017 12:09 PM | Updated on Aug 1 2018 2:26 PM

మస్కపూర్ కుంటలో ఇద్దరు యువతులు అనుమానాస్పదంగా మృతిచెందారు.

నిర్మల్: జిల్లాలోని ఖానాపూర్ మండలం మస్కపూర్ కుంటలో ఇద్దరు యువతులు అనుమానాస్పదంగా మృతిచెందారు. వీరి మృతదేహాలు ఆదివారం ఉదయం లభ్యమయ్యాయి. మృతులు ఖానాపుర్‌ ఇందిరానగర్‌ కాలనీవాసులు సరిత, హరిషగా గుర్తించారు.

సమాచారం అందుకున‍్న పోలీసులు సంఘటన స‍్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు యువతులను ఎవరైనా చంపేసి కుంటలో పడేశారా.. లేకుంటే ప్రమాదవశాత్తు కుంటలో పడిపోయారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement