మహానేత వైఎస్. రాజశేఖర రెడ్డి 67వ జయంతి వేడుకలు అమెరికాలోని అట్లాంటా నగరంలో ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు.
అట్లాంటా: మహానేత వైఎస్. రాజశేఖర రెడ్డి 67వ జయంతి వేడుకలు అమెరికాలోని అట్లాంటా నగరంలో ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు. జులై 17వ తేదీ ఆదివారం అభిమానులు, బంధుమిత్రాదుల సమక్షంలో జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ ప్రకాష్ రెడ్డి ఈ సందర్భంగా వైఎస్ఆర్ గురించి తమ అనుభవాలు పంచుకున్నారు. అలాగే తెలుగు ప్రజలకు వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలు, పేదల పట్ల ఆయన కనబరిచిన ప్రత్యేక శ్రద్ధను ప్రస్తావిస్తూ కృష్ణా రెడ్డి (రిటైర్డ్ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్), ప్రసాద్ రెడ్డి , వి. గురివిరెడ్డి, బాల రెడ్డి ఇందుర్తి తదితరులు ప్రసంగించారు.
మూడు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా మహానేత చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా అంజలి ఘటనించారు. కార్యక్రమ నిర్వాహకులు వైస్సార్సీపీ (అమెరికా) కన్వీనర్ గురువారెడ్డి , నంద గోపినాథ్ రెడ్డి,వెంకట్రామ్ చింతం ,శ్రీనివాసులరెడ్డి కొట్లూరు ,నరేష్ గువ్వా, శ్రీని వంగిమళ్ళ, కల్వకుర్తి ఉమా మహేశ్వర రెడ్డి ,ప్రసాద్ రెడ్డి, దామోదర్ రెడ్డి, చంద్రా, జగదీష్, విజయ్ కోట,లక్ష్మీ ఛారుగుంట వైఎస్ఆర్ జయంతికి హాజరైన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.