రామారెడ్డి(ఎల్లారెడ్డి): ‘‘ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఐదేళ్లుగా కష్టపడి చదువుతున్నా.. ఆ చదువుకు ఫలితం లేకుండా పోయింది. ఓఎంఆర్ షీట్లో వరుస క్రమం తప్పి పొరపాటు చేశాను. జీవితంలో ఉపాధ్యాయ ఉద్యోగం తప్ప మారేదాన్ని ఊహించుకోలేను’’అని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది ఓ యువతి. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన జపా సుప్రియ(24) సెకండరీ గ్రేడ్ టీచర్ కావాలన్న లక్ష్యంతో ఐదేళ్లుగా చదువుతోంది.
ఆదివారం ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష (ఎస్జీటీ) రాసింది. కాగా, సోమవారం విడుదలైన కీ ని చూసుకుని నివ్వెరపోయింది. పరీక్ష హాల్లో సమయం గడిచిపోతోందన్న తొందరలో ఓఎంఆర్ షీట్లో ఒక ప్రశ్నకు ఇంకో ప్రశ్న జవాబు వేసినట్లు గుర్తించింది. దాదాపు అన్ని ప్రశ్నలకు ఇలాగే జవాబులు రాయడంతో మనో వేదనకు గురైంది. ఇక తనకు ఉద్యోగం రాదని కలత చెంది బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పరీక్షలో చేసిన పొరపాటుకు శిక్ష విధించుకుంటున్నానని సూసైడ్ నోట్లో పేర్కొంది. మృతురాలి తండ్రి లింగారెడ్డి దుబాయ్లో ఉంటున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
టీచర్ ఉద్యోగం రాదని యువతి ఆత్మహత్య
Published Thu, Mar 1 2018 1:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement