భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య | Women Suicide of husband harassment | Sakshi
Sakshi News home page

భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

Apr 3 2018 10:57 AM | Updated on Oct 16 2018 3:15 PM

Women Suicide of husband  harassment - Sakshi

బావిలో నుంచి మృతదేహాన్ని తీస్తున్న పోలీసులు  

జహీరాబాద్‌ టౌన్‌: భర్త వేధింపులు భరించలేక వివాహిత బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని జహీరాబాద్‌ రూరల్‌ ఎస్‌ఐ. శ్రీకాంత్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రంజోల్‌ గ్రామానికి చెందిన లక్ష్మయ్య చిన్న కూతురు గుండమ్మ(19)ను ఝరాసంగం మండలంలోని కంకర్‌వాడ గ్రామానికి చెందిన బోయిని విఠల్‌ (30)కు ఇచ్చి నాలుగు నెలల కిత్రం పెళ్లి చేశారు.

పెళ్లయిన నాటి నుంచి భర్త గుండమ్మను వేధిస్తున్నాడు. మద్యం తాగి శారీరకంగా, మానసికంగా వేధిస్తుండడంతో గ్రామస్తుల సమక్షంలో పంచాయతీ పెట్టించారు. ఇక నుంచి ప్రవర్తన మార్చుకోవాలని, మద్యం తాగడం మాని వేయాలని గ్రామ పెద్దలు విఠల్‌ను ఒప్పించారు. అయినా అతడిలో మార్పురాలేదు.

యథావిధిగా మద్యం తాగి భార్యను కొట్టడంతో జీవితంపై విరక్తి చెందిన గుండమ్మ రంజోల్‌ గ్రామ సమీపంలోని ఓ బావిలో దూకి సోమవారం ఆత్మహత్య చేసుకుంది. తల్లి వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ శ్రీకాంత్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement