case registerd
-
కూటమి సర్కార్ కక్ష సాధింపు.. కొడాలి నానిపై కేసు
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి నేతల ఆగడాలు రోజురోజుకు శృతి మించుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్గా కూటమి నేతలు, పోలీసులు ముందుకు సాగుతున్నారు. నిన్నటి వరకు సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు కొనసాగగా.. ఇప్పుడు రాజకీయ నాయకులపై వేధింపులు మొదలయ్యాయి.మాజీ మంత్రి కొడాలి నానిపై లా విద్యార్థినితో కూటమి నేతలు ఫిర్యాదు చేయించారు. కూటమి నేతలు మాత్రమే కాకుండా విద్యార్థులను కూడా రాజకీయ కక్షలకు పావులుగా వాడుకుంటున్నారు. లా విద్యార్థిని ప్రియతో కూటమి నేతలు.. కొడాలి నానిపై త్రీటౌన్ పీఎస్లో ఫిర్యాదు చేయించారు. చంద్రబాబుపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీంతో, పోలీసులు నానిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
హత్రాస్ తొక్కిసలాట.. భోలే బాబాపై తొలి కేసు నమోదు
ఉత్తర్ప్రదేశ్లోని హథ్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి సూరజ్ పాల్ అలియాస్ నారాయణ్ హరి సాకర్ అలియాస్ భోలే బాబాపై తొలి కేసు నమోదైంది. పాట్నా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఆయనపై కేసు నమోదైంది.కాగా, జూలై 2న 121 మంది ప్రాణాలను బలిగొన్న హత్రాస్ తొక్కిసలాటలో ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాష్ మధుకర్ను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. మధుకర్ను శనివారం స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు. తొక్కిసలాట జరిగిన సత్సంగానికి చెందిన 'ముఖ్య సేవాదార్' మధుకర్ ప్రథమ ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఏకైక నిందితుడు. కాగా ఉత్తరప్రదేశ్ పోలీసులు మధుకర్ను పట్టుకునే వారికి రూ.లక్ష రివార్డు ప్రకటించిన సంగతి తెలిసిందేఇక తొక్కిసలాట ఘటన తర్వాత భోలో బాబా తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. జులై 2న జరిగిన ఘటనతో చాలా వేదనకు గురైనట్లు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధను భరించే శక్తి ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించినట్లు చెప్పారు. ప్రభుత్వం, పాలనా యంత్రాంగంపై నమ్మకం ఉంచాలని బాధితులకు సూచించారు. ఘటనకు కారకులను విడిచిపెట్టరనే విశ్వాసం తనకు ఉన్నట్లు పేర్కొన్నారు. మరణించిన కుటుంబాలు, గాయపడిన వారికి అండగా ఉండాలని కమిటీ సభ్యులను అభ్యర్థించినట్లు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు.మరోవైపు హత్రాస్ దుర్ఘటనపై విచారణ జరిపేందుకు, తొక్కిసలాట వెనుక కుట్ర ఉందనే విషయాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జూలై 3న హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్ను ఏర్పాటు చేసింది. -
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. ఈసీ ఆదేశాలతో మొఘల్పురా పీఎస్లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదుతో ఈసీ చర్యలు తీసుకుంది. విచారణ చేసి చర్యలతో పాటు రిపోర్టు ఇవ్వాలని హైదరాబాద్ సీపీకి ఈసీ ఆదేశించింది. ఏ3గా అమిత్షా పేరును హైదరాబాద్ పోలీసులు చేర్చారు. అమిత్ షా రోడ్ షోలో చిన్న పిల్లలను ప్రచారంలో ఉంచడంపై కాంగ్రెస్ ఫిర్యాదు చేయగా, సీఈవో వికాస్ రాజ్ స్పందించారు. -
Hyd: నిబంధనలు పాటించని పబ్లపై కొరడా.. ఆరు పబ్లపై కేసులు
సాక్షి, హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల రోజు నిబంధనలు ఉల్లంఘించిన పబ్లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. జూబ్లీహిల్స్లో ఆరు పబ్బులపై కేసులు నమోదు చేశారు. నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు నడిచిన హలో, టార్,గ్రీన్ మంకిస్, మకవ్,లాస్ట్, జీనా పబ్బులపై కేసులు నమోదయ్యాయి. నూతన సంవత్సర వేడుకల నిర్వహణకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలను పబ్ నిర్వాహకులు లెక్కచేయలేదు. అధిక డీజే సౌండ్తో స్థానికులను ఇబ్బందిపెట్టినందుకు కూడా కేసు నమోదు చేశారు. భారీ శబ్ధాలు వస్తున్నాయని స్థానికులు ఫిర్యాదు. ఐపీసీ సెక్షన్ 188, 290, సీపీ చట్టం కింద కేసు నమోదైంది. కాగా, కొత్త ఏడాదికి లిక్కర్ కిక్కు బాగానే ఎక్కింది. కొత్త సంవత్సర వేడుకల ప్రారంభమయ్యే రోజుతో పాటు రెండు రోజుల ముందు నుంచీ ఏకంగా రూ.620 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి వైన్షాపులకు చేరింది. డిసెంబర్ 31న ఆదివారం సెలవుదినం అయినా, మద్యం డిపోలు తెరచి ఉంచగా, రూ.127 కోట్ల విలువైన మద్యం షాపులకు చేరింది డిసెంబర్ 30న రూ.313 కోట్లు, డిసెంబర్ 29న రూ.180 కోట్ల మద్యం డిపోల నుంచి వెళ్లిందని ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, కొత్తగా ప్రారంభమైన షాపుల్లో అమ్మకాల కోసం ఈ నెల మొదట్లోనే పెద్ద ఎత్తున లిక్కర్ చేరిందని, ఈ నేపథ్యంలో కొంత తగ్గుదల కనిపిస్తుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: నుమాయిష్ 2024 ప్రారంభం.. మాస్క్ కంపల్సరీ! -
లిక్కర్ స్కాం కేసులో కొత్త ట్విస్ట్.. లంచం తీసుకున్న ఈడీ ఆఫీసర్
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇటు తెలంగాణ రాజకీయాల్లోనూ లిక్కర్ స్కాం కేసు ప్రకంపనలు సృష్టించింది. అయితే, ఈ కేసులో తాజాగా కొత్త కోణం బయటకు వచ్చింది. లిక్కర్ కేసు దర్యాప్తులో అధికారులు లంచం తీసుకున్నట్టు ఆరోపణలు బయటకు వచ్చాయి. వివరాల ప్రకారం.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. కేసు దర్యాప్తులో అధికారులు లంచం తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఖత్రీపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఖత్రీతో పాటుగా అప్పర్ డివిజన్ క్లర్క్ నితేష్ కోహర్, క్లారిడ్జెస్ హోటల్స్ సీఈవో విక్రమాదిత్య, ఎయిర్ ఇండియా ఉద్యోగి దీపక్ సాంగ్వాన్, అమన్దీప్ సింగ్ ధాల్, బీరేందర్ పాల్ సింగ్, ప్రవీణ్ కుమార్ వాట్స్పై కూడా సీబీఐ కేసు ఫైల్ చేసింది. అయితే, సదరు అధికారి లంచం తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రూ.5కోట్లు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. CBI has registered a case against Pawan Khatri, Assistant Director ED, Deepak Sangwan employee of Air India, Vikramaditya CEO of Claridges Hotels & Resorts and others accused in connection with the ongoing delhi liquor scam case. — ANI (@ANI) August 28, 2023 ఇది కూడా చదవండి: భారత్కు రాలేనన్న పుతిన్.. అరెస్ట్ భయమే కారణమా? -
పవన్ పై పోలీస్ కేసు నమోదు
-
తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న.. ఎవరూ లేని సమయంలో..
తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న దారుణానికి ఒడిగట్టాడు. అన్నాదమ్ములు ఇద్దరూ కవలలు కావడంతో.. దీన్ని ఆసరాగా తీసుకున్న అన్న.. మరదాలిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఒకే రూపంతో ఉన్న అతడి విషయంలో మోసపోయిన ఆమె.. విషయం భర్తకు చెప్పడంతో అతడి సమాధానం విని షాకైంది. వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా కేంద్రం శివాజీనగర్లో ఓ కుటుంబం నివసిస్తోంది. వారి కుటుంబంలో ఇద్దరు కవలసోదరులు ఉన్నారు. వారిని ఎవరు అని గుర్తించడమే పేరెంట్స్కే కొన్నిసార్లు సాధ్యపడేది కాదు. ఇదిలా ఉండగా.. వాళ్లకు పెళ్లీడు రావడంతో కుటుంబీకులు కవలలైన అమ్మాయిల జంట కోసం వెతికారు. అలా దొరక్కపోవడంతో ఎవరో ఒకరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. కొద్దిరోజులు గడిచాక.. తనకు ఇప్పుడే పెళ్లి వద్దని పెద్దోడు చెప్పడంతో ఆరు నెలల కిందట చిన్నోడికి ఓ అమ్మాయితో వివాహం జరిపించారు. ఇప్పటి వరకు అంతా బాగానే సాగిన వ్యవహారం.. ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఓ సమయంలో అత్తారింట్లో కాపురానికి వచ్చిన మరదలిపై.. అన్న కన్నేశాడు. అన్నదమ్ములిద్దరూ ఒకేలా ఉండటంతో అతడికి అది వరమైంది. ఓ రోజు తమ్ముడు లేని సమయం చూసుకొని అతనిలా గదిలోకి దూరి మరదలితో లైంగిక దాడికి పాల్పడ్డాడు. భర్తే కదానే నమ్మకంతో ఆమె కూడా అడ్డుచెప్పలేదు. ఇలా ఆరు నెలలుగా వికృత ఉదంతం కొనసాగుతుండగా.. అనుమానం వచ్చిన ఆమె.. అసలు విషయం తెలుసుకుని షాకైంది. ఈ విషయాన్ని వెంటనే.. తన భర్త, అత్తమామలకు చెప్పేసింది. ఈ క్రమంలో భర్తతో సహా కుటుంభ సభ్యులందరూ అన్నకే మద్దతిచ్చారు. విషయం బయటికి తెలిస్తే కుటుంబం పరువు పోతుందని, కాబట్టి నోరు మూసుకుని మునుపటిలా సాగిపోమని భర్తతోపాటు మిగతా అందరూ ఆమెను బెదిరించారు. వారి బెదిరింపులను లెక్కచేయని బాధితురాలు.. తన పుట్టింటివాళ్లను పిలిపించి, వారి సాయంతో పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేసింది. బాధితురాల ఫిర్యాదుతో పోలీసులు కవల సోదరుడిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు శివాజీనగర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి దిలీప్ దొలారే తెలిపారు. ఇది కూడా చదవండి: ప్రేమ పెళ్లి.. నా భర్త దగ్గరికి వెళ్లిపోతా.. ఇంతలోనే ఘోరం.. -
‘లవ్ యూ’ అంటూ దగ్గరయ్యాడు.. శారీరకంగా ఒక్కటయ్యాక..
ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడ్డాడు. అతడి మాటలు నమ్మిన ఆమె.. శారీరకంగా దగ్గరైంది. తీరా పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాక.. అతడి నిజస్వరూపం తెలుసుకొని బాధితురాలు షాకైంది. అనంతరం ఆమెను మతం మార్చుకోవాలని ఒత్తిడి చేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసుల అధికారి అలోక్ శ్రీ వాస్తవ తెలిపిన వివరాల ప్రకారం.. భోపాల్లోని అశోకనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో నిహల్ ఖాన్(30) అనే వ్యక్తి ఆసుపత్రిని రన్ చేస్తున్నాడు. ఆసుపత్రిలో బాధితురాలు(28) ఫిజియోథెరిపిస్టుగా పని చేస్తోంది. కాగా, కుటుంబ కలహాల కారణంగా బాధితురాలు 2018లో తన భర్త నుంచి విడిపోయి ఒంటరిగా బ్రతుకుతోంది. అయితే, ఆమె ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో నిహల్ ఖాన్లో క్లోజ్నెస్ ఏర్పడింది. ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వారిద్దరూ శారీరంగా ఒక్కటయ్యారు. తీరా పెళ్లి ప్రస్తావన తెచ్చాక.. తాను హిందు కాదని ముస్లిం అని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాకైంది. నిహల్ ఖాన్ తనను మోసం చేశాడని గుర్తించింది. అనంతరం అతడిని ఎందుకిలా చేశావని నిలదీయగా.. మతం మార్చుకుంటే తనను పెళ్లి చేసుకుంటానని నిహల్ చెప్పడంతో ఖంగుతింది. ఈ క్రమంలో ఆమెను మతం మారాలని అతడు ఒత్తిడి చేస్తున్నాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు నిహాల్ ఖాన్పై మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛ చట్టం, భారతీయ శిక్షాస్మృతి ప్రకారం అత్యాచారం ఆరోపణలపై ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేసినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టిన మామిడికాయ పచ్చడి.. క్షణికావేశంలో -
Pakistan: ఇమ్రాన్ఖాన్కు మరో బిగ్ షాక్
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పాక్ మాజీ పీఎం ఇమ్రాన్ఖాన్తో సహా మరో 150 మందిపై పోలీసులు నమోదు చేశారు. దీంతో దేశంలో వీరి అరెస్ట్ చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. సౌదీ అరేబియాలోని మస్జిద్-ఎ-నబ్వీ వద్ద ప్రధాని షహబాజ్ షరీఫ్ను ఉద్దేశించి ఇమ్రాన్ సహా మరికొంత మంది నేతలు దొంగ, ద్రోహి అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. పాకిస్తాన్ శిక్షా స్మృతిలోని సెక్షన్ 295ఏ కింద ఇమ్రాన్తో సహా 150 మందిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాను ఎవరికి వ్యతిరేకంగా నినాదాలు చేయలేదని ఇమ్రాన్ స్పష్టం చేశారు. ఇక కేసు నమోదైన వారిలో మాజీ మంత్రులు ఫవాద్ చౌదరి, షహబాజ్ గుల్, షేక్ రషీద్ ఉన్నారు. ఇది కూడా చదవండి: చైనా కంపెనీ షావోమీకి బిగ్ షాక్ -
వివాహేతర సంబంధం.. మహిళను కరెంట్ పోల్కు కట్టేసి..
వివాహేతర సంబంధాలు కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. తాజాగా వివాహేతర సంబంధం కారణంగా ఓ మహిళను కరెంట్ స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు. ఈ ఘటన బీహార్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రోహతాస్ జిల్లాలోని సింగపూర్కు చెందిన ఓ మహిళ గ్రామంలోని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ ఆమెను కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టారు. ఆమె భర్త దీపక్రామ్, మామ, ముగ్గురు పిల్లలు బాధితురాలిని చితకబాదారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను రక్షించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని.. దీపక్ రామ్, అతని తండ్రి శివపూజన్ రామ్, ముగ్గురు పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్టు రోహాతస్ పోలీసు సూపరింటెండెంట్ ఆశిష్ భారతి తెలిపారు. -
ఒకే ఫ్యామిలీలో ఐదుగురు దారుణ హత్య.. యువతిపై అత్యాచారం..?
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. కాగా, మృతిచెందిన వారిలో రెండేళ్ల చిన్నారి కూడా ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ప్రయాగ్రాజ్లోని సంగం నగరంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. ఇందులో ఓ చిన్నారి, దివ్యాంగురాలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. అయితే, గారాపూర్ నుంచి సికంద్రా వెళ్లే రోడ్డు పక్కన రాజ్కుమార్ యాదవ్(55) తన ఫ్యామిలీతో కలిసి నివాసిస్తున్నాడు. కాగా, గుర్తు తెలియని కొందరు వ్యక్తులు శనివారం ఉదయం వారి ఇంట్లోకి ప్రవేశించి రాజ్కుమార్ యాదవ్, అతని భార్య కుసుమ్ దేవి(52), కోడలు సవిత(27), దివ్యాంగురాలైన కుమార్తె మనీషా(25), మనవరాలు మీనాక్షి(2)ని దారుణంగా హత్య చేశారు. దుండగుల దాడి నుంచి యాదవ్ మనుమరాలు సాక్షి(5) తప్పించుకోగా యాదవ్ కుమారుడు ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలు కాపాడుకున్నాడు. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్తో సోదాలు నిర్వహిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు.. మనీషా బట్టలు చిందరవందరగా ఉండటంతో హత్యకు ముందు ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇది కూడా చదవండి: విషాదంగా ప్రేమ పెళ్లి.. ఇంటి నుంచి వెళ్లిపోయి.. -
Punjab CM: వివాదంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్
ఛండీగఢ్: పంజాబ్ సీఎం భగవంత్మాన్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై శనివారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. బీజేపీ నేత తజీందర్ పాల్ సింగ్ బగ్గా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం పంజాబ్లో కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం.. సీఎం భగవంత్ మాన్ ఏప్రిల్ 14వ తేదీన మద్యం సేవించి గురుద్వారాలోకి ప్రవేశించారని తజీందర్ సింగ్ తెలిపారు. అయితే, దేశవ్యాప్తంగా జరుపుకునే బైసాఖీ సందర్భంగా పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ మద్యం సేవించిన స్థితిలో తఖ్త్ దమ్దామా సాహిబ్లోకి ప్రవేశించారని శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (ఎస్జిపిసి) అంతకుముందు శుక్రవారం ఆరోపించింది. దీంతో తాజాగా బీజేపీ నేత బగ్గీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఈ క్రమంలోన సీఎం క్షమాపణలు చెప్పాలని కమిటీ డిమాండ్ చేసింది. ఈ సందర్బంగా భగ్గా.. ట్విట్టర్ వేదికగా తన ఫిర్యాదు మేరకు సీఎంపై చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని కోరారు. Filed Police complaint against Punjab CM @BhagwantMann for Entering Gurudwara Damdama Sahib in Drunk Condition. I request @DGPPunjabPolice @PunjabPoliceInd to take action on my complaint pic.twitter.com/3bde4i32zI — Tajinder Pal Singh Bagga (@TajinderBagga) April 16, 2022 ‘అతనో పచ్చి తాగుబోతు.. డ్రగ్స్ కూడా వాడతాడు.. నిత్యం నిషాలో జోగుతుండే మాన్. బఫూన్ వేశాలేసుకునేటోడు. అతన్నే గనుక గెలిపిస్తే పంజాబ్ మొత్తాన్నీ మత్తులో ముంచేస్తాడు.. ’ ఇదీ.. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు భగవంత్ మాన్పై చేసిన ఆరోపణ. కాగా, భగవంత్ మాన్ మద్యం సేవించి పార్లమెంటుకు వస్తారని ఆరోపణలున్నాయి. సహచర ఎంపీలు ఆయన నుంచి వచ్చే మద్యం వాసన భరించలేక ఫిర్యాదులు కూడా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యర్థి నేతలు.. ‘అతనో పచ్చి తాగుబోతు.. డ్రగ్స్ కూడా వాడతాడు.. నిత్యం నిషాలో జోగుతుండే మాన్ను గెలిపిస్తే పంజాబ్ మొత్తాన్నీ మత్తులో ముంచేస్తాడని ఆరోపించారు. అయితే.. రెండేళ్ల క్రితం బర్నాలాలో జరిగిన ఒక ర్యాలీలో తాను ఇంక మద్యం జోలికి వెళ్లనంటూ ప్రజలందరి మధ్య ప్రతిజ్ఞ చేశారు. మద్యం మానేశానని, ప్రజాప్రతినిధిగా, పంజాబ్ సీఎంగా కళ్లు నెత్తికెక్కించుకోకుండా.. బాధ్యతగా మసలుకుంటానని ఎన్నికల ప్రచారంలో మాన్ ప్రజలకు చెప్పారు. -
యూపీలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదం.. ఆ తర్వాత ఏమైందంటే..?
లక్నో: భారత్, పాకిస్తాన్ విషయంలో రెండు దేశాలకు సంబంధించిన స్లోగన్స్ విషయం ఎంతో సున్నితమైనవి. ఏ మాత్రం తేడా వచ్చినా అంతే సంగతి. అలాంటిది.. భారత్లో పాకిస్తాన్ జిందాబాద్.. అంటూ స్లోగన్స్తో ఉన్న పాటను వింటున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో సింఘై కలాన్ గ్రామంలో ఓ దుకాణదారుడు తన షాపులో ‘పాకిస్తాన్ జిందాబాద్’ పాట ప్లే చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను చూసిన బీజేపీ నేతలు భూటా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు నిందితులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసులో భాగంగా నిందితులను విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని బరేలీ (రూరల్) ఎస్పీ రాజ్కుమార్ అగర్వాల్ వెల్లడించారు. ఈ ఘటన అనంతరం నిందితుడి తల్లి మాట్లాడుతూ.. "ఏం జరిగిందో మాకు తెలియదు. నా చిన్న కొడుకు తన మొబైల్ ఫోన్లో మతపరమైన పాటలు విన్నాడని చెబుతున్నారు. ఫోన్లో అలాంటి నినాదాలు ఉన్నాయని అతనికి తెలియదు. మేము ఎప్పుడూ మొబైల్ ఫోన్లో అలాంటి పాటలు ప్లే చేయలేదు. అతను చదువుకోలేదు. దయచేసి నా కొడుకును విడుదల చేయండి’’ అని పోలీసులను అభ్యర్థించింది. Rojedar Mustakim & Naeem, who were playing the song 'Pakistan Zindabad' in Bareilly, were arrested by the UP Police on complaint of BJP leaders Himanshu Patel and Ashish Patel, in Eid Manegi Jail. pic.twitter.com/SBjwSSsAVo — Raj Karsewak (@rajkarsewak) April 15, 2022 ఉత్తరప్రదేశ్లో ఇలాంటి నినాదాలు వినిపించడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది యూపీలోని నోయిడాలో ఓ మతపరమైన ఊరేగింపులో ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ అనే నినాదాలు చేసినందుకు ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. -
సూసైడ్ కలకలం: మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు.. రంగంలోకి సీఎం
సాక్షి, బెంగళూరు: మంత్రి ఈశ్వరప్పకు కమీషన్లు ఇచ్చుకోలేనని సంతోష్పాటిల్ అనే బెళగావి జిల్లా కాంట్రాక్టర్ మంగళవారం ఉడుపిలోని ఒక లాడ్జిలో ఆత్మహత్య చేసుకోవడం కర్నాటకలో కలకలం రేపుతోంది. రాష్ట్ర పంచాయతీ రాజ్ – గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్పే తన ఆత్మహత్యకు కారణమని కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ డెత్ నోట్ రాసిపెట్టి సూసైడ్ చేసుకున్నాడు. దీంతో మంత్రి పదవి నుంచి ఈశ్వరప్పను తప్పించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంతోష్ పాటిల్ సోదరుడి ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో మంత్రి ఈశ్వరప్పతో పాటు ఆయన మద్దతుదారులు బసవరాజ్, రమేశ్ పేర్లను కూడా చేర్చారు. అయితే ఈ కేసును పారదర్శకంగా దర్యాప్తు చేయాలని పోలీసులను కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదేశించారు. కాషాయ జెండా వివాదం.. బీజేపీలో ఎంతో సీనియర్ అయిన కేఎస్ ఈశ్వరప్పకు మాజీ సీఎం యడియూరప్పతో అసలు పొసగదు. అనేక మంది పార్టీ నేతలతోనూ అంతంతమాత్రమే సంబంధాలున్నాయి. ఎర్రకోటపై కాషాయ జెండా ఎగురుగుతుందని ఈశ్వరప్ప ఇటీవల చేసిన వ్యాఖ్యల వల్ల అసెంబ్లీ సమావేశాలను కాంగ్రెస్పార్టీ వారంరోజుల పాటు అడ్డుకుంది. యడియూరప్ప, బొమ్మై మంతనాలు బెళగావి పర్యటనలో ఉన్న బీఎస్ యడియూరప్పతో మంగళవారం రాత్రి సీఎం బసవరాజ్ బొమ్మై భేటీ అయ్యారు. ఈశ్వరప్ప విషయమై చర్చించినట్లు తెలిసింది. నేడో – రేపో ఈశ్వరప్ప నుంచి రాజీనామా కోరవచ్చని సమాచారం. ఇదో చేతకాని సర్కార్: సుర్జేవాలా ఇది చేతకాని ప్రభుత్వమని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి రణదీప్సింగ్ సుర్జేవాలా అన్నారు. మంగళవారం ఆయన బెంగళూరులో మాట్లాడుతూ ఓ కాంట్రాక్టరును మంత్రి 40 శాతం కమీషన్ అడిగారని ఆత్మహత్య చేసుకోవడం దారుణం, ఆ మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం అన్నారు. బుధవారం కాంగ్రెస్ నేతలు గవర్నర్ను కలవనున్నారు. ఇది చదవండి: మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి అసదుద్దీన్ సవాల్ -
బోయిగూడ అగ్ని ప్రమాదం.. గాంధీ ఆసుపత్రిలో ప్రత్యక్ష సాక్షి ప్రేమ్ ఏం చెప్పాడంటే..
సాక్షి, హైదరాబాద్: బోయిగూడలో మంగళవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కార్మికులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన ప్రత్యక్ష సాక్షి.. బీహార్కు చెందిన ప్రేమ్ కుమార్ బుధవారం పోలీసులకు కీలక విషయాలను వెల్లడించారు. ప్రేమ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. స్క్రాప్ గోడౌన్ యజమాని నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందన్నాడు. రెండేళ్ల నుంచి స్క్రాప్ గోడౌన్లో పనిచేస్తున్నట్టు తెలిపాడు. నిన్న రాత్రి తనతో పాటుగా మరో 11 మంది రెండు గదుల్లో నిద్రపోతున్నామని చెప్పాడు. ఓ చిన్న రూమ్లో తనతో పాటు బిట్టు, సంపత్ ఉండగా.. మరో తొమ్మిది మంది వేరే గదిలో నిద్రపోతున్నారని తెలిపాడు. కాగా, రాత్రి 3 గంటల సమయంలో గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని అన్నాడు. దీంతో కార్మికులందరూ బయటకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో తాను ఎంతో కష్టంతో కిటీకీలో నుంచి బయటకి దూకి ప్రాణాలను కాపాడుకున్నట్టు తెలిపాడు. కానీ, మిగిలిన వారంతా మంటల్లోనే సజీవ దహనమయ్యారని ఆవేదన చెందాడు. ఈ క్రమంలో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారని.. అనంతరం తనను గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. ప్రేమ్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్తో స్క్రాప్ గోదాం ఓనర్ సంపత్ పై కేసు నమోదు పోలీసులు వెల్లడించారు. సంపత్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, మృతులను సికిందర్(40), బిట్టు కుమార్ రామ్(20), సత్యేందర్ కుమార్(30), చెట్టిలాల్ రామ్(28), దామోదర్(27), శింటు కుమార్(27), దుర్గా రామ్(35), రాకేష్(25), దీపక్ కుమార్ రామ్(26), పంకజ్(26), దరోగా కుమార్(35)గా గుర్తించారు. ప్రేమ్(25) ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. -
అద్భుత కలశం పేరుతో బురిడీ
నిమ్మనపల్లె (చిత్తూరు జిల్లా) : తమ వద్ద అతీత శక్తులున్న అద్భుత కలశం ఉందంటూ చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె, కలికిరి మండలాలకు చెందిన నలుగురు వ్యక్తులు తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన పలువురి నుంచి రూ.9 లక్షల నగదు వసూలు చేసి పరారయ్యారు. బాధితులు ఆదివారం నిమ్మనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్ఐ ఫాతిమా కథనం ప్రకారం.. నిమ్మనపల్లె మండలం, వెంకోజిగారిపల్లెకు చెందిన మల్లేశ్వరరావు, తవళం గ్రామానికి చెందిన ఎల్లారెడ్డి, కలికిరి మండలం, గొల్లపల్లెకి చెందిన చిన్నబ్బ, కలికిరికి చెందిన రమణారెడ్డి ముఠాగా ఏర్పడ్డారు. వీరు ఇటీవల తిరువళ్లూరు జిల్లా, పల్లిపట్టు తాలూకా, కేశవరాజు కుప్పంకు చెందిన పలువురిని కలిశారు. తమ వద్ద అతీత శక్తులు కలిగిన, అద్భుత పురాతన కలశం ఉందని, దానికి చాలా మహిమలున్నాయని, గుప్త నిధులు, బియ్యం ఆకర్షించగలదని నమ్మించారు. కలశం ఉన్నవారికి సిరి సంపదలు, అతీత శక్తులు సిద్ధిస్తాయని చెప్పారు. రూ.కోట్లు విలువ చేసే కలశాన్ని రూ.20 లక్షలకే ఇస్తామనడంతో వారి మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో శనివారం నిమ్మనపల్లె మండలం, ముష్ఠూరు గ్రామం, బహుదా ప్రాజెక్టు వద్దనున్న అమ్మవారి గుడివద్ద కలశాన్ని అందజేస్తామన్నారు. బాధితులు శనివారం నిందితులను కలిసి, కలశం ఇవ్వాలని అడగ్గా.. గుడిలో కలశానికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయని, పూజల అనంతరం రాత్రికి కలశాన్ని తీసుకెళ్లవచ్చునని చెప్పారు. వారి మాటలు నమ్మి రూ.9 లక్షల నగదును నిందితులకు అందజేశారు. అంతే.. నిందితులు నగదు తీసుకుని పరారయ్యారు. కలశం కోసం వెళ్లిన బాధితులకు అక్కడ కలశం లేకపోవడం.. నిందితులు స్పందించకపోవడంతో మోసపోయామని గ్రహించారు. బాధితులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ ఫాతిమా నిందితులు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో ఒకరైన మల్లేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
ట్వీట్ తెచ్చిన తంటా.. చిక్కుల్లో సిద్ధార్ధ్
-
హీరో సిద్ధార్థ్పై కేసు నమోదు..
భారత్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్పై హీరో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అన్ని వర్గాల నుంచి సిద్ధార్థ్ తీరుపై విమర్శలు రావడంతో సైనాకు క్షమాపణలు కూడా చెప్పాడు. ఇదిలా ఉంటే తాజాగా సిద్ధార్థ్పై కేసు నమోదైంది. సైనా నెహ్వాల్పై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని బంజారాహిల్స్కు చెందిన సామాజిక కార్యకర్త ప్రేరణ తిరువాయిపట్టి అనే మహిళ సిద్ధార్థ్పై ఫిర్యాదు చేసింది. ప్రేరణ ఇచ్చిన కంప్లైంట్ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 67 సైబర్ యాక్ట్, ఐపీసీ 509 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సైనా నెహ్వాల్కు క్షమాపణలు చెబుతూ సిద్ధార్థ్ రాసిన బహిరంగ లేఖలో 'డియర్ సైనా.. నా ట్వీట్ ద్వారా చేసిన రూడ్ జోక్కి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. మిమ్మల్ని కించపరిచాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. మిమ్మల్ని అవమానించాలని ఆ ట్వీట్ చేయలేదు. నేను ఒక జోక్ వేశాను. అది తప్పుగా చేరింది. ఆ విషయంలో సారీ. నా ఉద్దేశ్యంలో ఎలాంటి తప్పు లేకున్నా కొందరు దానిని తప్పుగా చూపి నా మీద విమర్శలు చేశారు. మహిళలు అంటే నాకు ఎంతో గౌరవం. నా ట్వీట్లో జెండర్కు సంబంధించిన విషయాలేవీ లేవు. నా క్షమాపణలు అంగీకరిస్తావని కోరుకుంటున్నా. నువ్ నాకు ఎప్పుడూ ఛాంపియన్గా ఉంటావు సైనా' అని రాసుకొచ్చాడు. ఇదీ చదవండి: సైనా నెహ్వాల్పై సిద్ధార్థ్ అభ్యంతరకర వ్యాఖ్యలు, దూమరం రేపుతోన్న సిద్ధార్థ్ ట్వీట్ -
టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు
గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై అరండల్పేట పీఎస్లో కేసు నమోదు అయింది. ఏపీలో ఎన్440కే వైరస్ ఉందంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేశారంటూ న్యాయవాది పచ్చల అనిల్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు చంద్రబాబుపై 118, 505(1)బి, 505(2), 54 సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. -
బాధిత కుటుంబంపై కేసు పెట్టాలి
లక్నో/హాథ్రస్: హత్యాచార నిందితులకు మద్దతుగా హాథ్రస్లో ఆదివారం బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రాజ్వీర్ సింగ్ పహిల్వాన్ నివాసంలో ఒక సమావేశం జరిగింది. నిందితులకు మద్ధతుగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ సమావేశానికి హాజరయ్యారని రాజ్వీర్ సింగ్ కుమారుడు మన్వీర్ సింగ్ తెలిపారు. అగ్రకులాల వారే కాకుండా, సమాజం లోని అన్ని వర్గాల వారు ఈ సమావేశానికి వచ్చారన్నారు. బాధిత కుటుంబ సభ్యులపైనా కేసు నమోదు చేయాలని ఆ సమావేశంలో డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించి బాధిత కుటుంబం పలుమార్లు తమ స్టేట్మెంట్ను మార్చారని ఆరోపించారు. ఈ సమావేశం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నివాసం వద్ద ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులను మోహరించారు. ‘సీబీఐ దర్యాప్తును స్వాగతిస్తున్నాం. వారి దర్యాప్తుపై మాకు విశ్వాసముంది’ అని మన్వీర్ పేర్కొన్నారు. ‘ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్ర ఇది. ఎలాంటి విచారణకైనా నిందితులు సిద్ధంగా ఉన్నారు. వారు తప్పు చేసి ఉంటే ఎప్పుడో పారిపోయేవారు. బాధిత కుటుంబమే ఎప్పటికప్పుడు మాట మారుస్తోంది. నార్కో టెస్ట్కో లేక సీబీఐ దర్యాప్తుకో వారు సిద్ధంగా లేరు’ అన్నారు. కొనసాగుతున్న సిట్ దర్యాప్తు హాథ్రస్ హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సిఫారసు చేసిన మర్నాడు కూడా.. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తన దర్యాప్తు కొనసాగించింది. ఆదివారం సీనియర్ ఐపీఎస్ అధికారి భగవాన్ స్వరూప్ నేతృత్వంలో సిట్ బాధితురాలి కుటుంబసభ్యుల వాంగ్మూలాలను నమోదు చేసింది. అలాగే, ఈ కేసు విషయంలో సమాచారం ఇవ్వాలనుకునే వారు తమ వద్దకు రావాలని గ్రామస్తులకు సూచించింది. -
అమరావతి భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు
సాక్షి, అమరావతి : అమరావతి రాజధాని భూకుంభకోణంపై మంగళవారం ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ప్రాథమిక నివేదికల ఆధారంగా ఏసీబీ మరింత లోతుగా దర్యాప్తు చేపట్టనుంది. రాజధాని విషయం ముందే తెలుసుకుని ఎవరెవరు భూములు కొన్నారు అనే కోణంలో దర్యాప్తు జరుపుతుంది. రాజధాని ప్రకటనకు ముందే టీడీపీకి చెందిన పలువురు నేతలు, ప్రముఖులు దాదాపు 4,075 ఎకరాల కొనుగోలు చేశారు. అందులో 900 ఎకరాల అసైన్డ్ భూములను దళితుల నుంచి బలవంతంగా కొనుగోలు చేసినట్లు తేలింది. కాగా ఈ భూములు కొన్నవారిలో తెల్లరేషన్కార్డు దారులుతో పాటు టీడీపీ నేతలు, సన్నిహితులు, బినామీలు భూములు కొన్నట్టు గుర్తించారు. అలాగే టీడీపీ నేతలకు వాటాలు ఉన్న కంపెనీలు కూడా భూములు కొనుగోలు చేశారని తెలిసింది. ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డ వారిలో పరిటాల సునీత, జీవీఎస్ ఆంజనేయులు, పయ్యావుల కేశవ్, లంకా దినకర్, ధూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్, పుట్టా మహేష్తో పాటు పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. (చదవండి : రాజధాని అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి) సెప్టెంబర్ 3,2015న చంద్రబాబు రాజధాని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కాగా అంతకముందే జూన్ 1,2014 నుంచి డిసెంబర్ 31,2014 వరకు భూముల కొనుగోళ్లు జరిగాయని.. 1977 అసైన్డ్ భూముల చట్టం, 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టం ఉల్లంఘించారని నిర్ధారణ అయింది. లంక, పోరంబోకు, ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాల గుర్తింపు జరిగినట్లు తేలింది. లాండ్ పూలింగ్ స్కీమ్ కోసం రికార్డులు తారుమారు చేసినట్టు తెలుస్తుంది. నారా లోకేష్ బినామీ వేమూరి రవి కుటుంబం పేరుతో 62 ఎకరాల భూమి, మరో టీడీపీ నేత లింగమనేని రమేష్ భార్యా, బంధువుల పేరిట భూముల కొనుగోలు చేశారు. మాజీ మంత్రి నారాయణ బినామీల పేర్లతో 55 ఎకరాలు కొనుగోలు చేశారని.. అందులో సన్నిహితులు ఆవుల మునిశేఖర్, రాపూరు సాంబశివరావు, కొత్తపు వరుణ కుమార్, పొత్తూరి ప్రమీల పేర్లతో 55.27 ఎకరాలు కొనుగోలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాల పాటి శ్రీధర్ బినామీ పేర్లతో 68.6 ఎకరాలు, మాజీ మంత్రి ప్రత్తిపాటి గుమ్మడి సురేష్ పేరుతో 38 ఎకరాలు, మరో మంత్రి రావెల కిషోర్బాబు మైత్రీ ఇన్ ఫ్రా పేరుతో 40 ఎకరాలు కొన్నట్లు తేలింది. టీడీపీ నేతల కోసం సీఆర్డీఏ పరిధినే మార్చిన బాబు ప్రభుత్వం టీడీపీ నేతల కోసమే గతంలో చంద్రబాబు ప్రభుత్వం సీఆర్డీయే పరిధిని మార్చేసింది. బాలకృష్ణ వియ్యంకుడికి చెందిన విబిసి కెమికల్స్ సంస్థకు 498 ఎకరాల కేటాయింపులు జరిగినట్లు తేలింది. కాగా భూములు కేటాయించాక సీఆర్డీయే పరిధి మారుస్తూ బాబు ప్రభుత్వం జీవో జారీ చేసింది. వివిధ సంస్థలకు భూ కేటాయింపుల్లోనూ అక్రమాలు ఉన్నట్లు తేలిందని ఏసీబీ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలకో రేటు, ప్రైవేటు సంస్థలకు మరో రేటుగా నిర్ణయించారని.. 5 ప్రైవేటు సంస్థలకు 850 ఎకరాల భూమి కేటాయింపులోనూ అక్రమాలు జరిగినట్లు తేలింది. (చదవండి : దివీస్లో ఇన్సైడర్ ట్రేడింగ్!) -
చెవిరెడ్డి ధర్నాతో దిగొచ్చిన పోలీసులు
సాక్షి, తిరుపతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పోరాటం ఫలించింది. తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పల్లి పోలీస్స్టేషన్ ఎదుట బుధవారం అర్ధరాత్రి వరకు ఆయన ధర్నా చేపట్టారు. భాస్కర్రెడ్డి ధర్నాతో దిగొచ్చిన పోలీసులు నాగభూషణం, సిసింద్రీపై ఐపీసీ 323, 120 బీ, ఐపీసీ రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తన మీద దాడికి టీడీపీ నాయకులు కుట్ర చేయడం దారుణమని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఇద్దరి డ్రైవర్లకి ఉద్యోగం ఇచ్చి నెల రోజులు అన్నం పెట్టానని.. తాను పెట్టిన అన్నం తిన్నవారే తనపై రెక్కీ నిర్వహించడం బాధకరమన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినందునే దాడి.. నియోజకవర్గంలోని తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం పసుపు–కుంకుమ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. స్థానిక ఎమ్మెల్యే హోదాలో ప్రసంగిస్తున్న ఆయన్ని అడ్డుకున్నారు. ఇది టీడీపీ కార్యక్రమం అని, ఇందులో మీ ప్రసంగాలు ఏంటని? మైక్ కట్ చేయించారు. అధికారులు వారిస్తున్నా వినకుండా చెవిరెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎమ్మెల్యే చెవిరెడ్డికి పోలీసులు, మహిళలు రక్షణగా నిలిచారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులు, మహిళలపై రాళ్లు, కారం పొడి, స్వీట్ ప్యాకెట్లతో దాడి చేశారు. దాడిలో ఎమ్మెల్యేతో పాటు తిరుపతి వెస్ట్ డీఎస్పీ, ఎంఆర్ పల్లి సీఐ, ముగ్గురు మహిళలకు గాయాలు అయ్యాయి. పోలీసులకు, టీడీపీ నాయకులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. తోపులాటలో ఎమ్మెల్యే చెవిరెడ్డి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సృహతప్పి కింద పడ్డారు. (చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై టీడీపీ నేతల రెక్కీ) -
ఆస్తానా కేసు పూర్వాపరాలు..
సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాపై ఆ సంస్థే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. తాజా పరిణామం నేపథ్యంలో ప్రధాని కార్యాలయం సోమవారం సీబీఐ డెరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాలకు సమన్లు జారీ చేసింది. సీబీఐ అత్యున్నత అధికారులిద్దరి మధ్య ఏడాది కాలంగా జరుగుతున్న అంతర్గత పోరాటం ఆస్తానాపై ఎఫ్ఐఆర్ నమోదుతో తీవ్రరూపం దాల్చింది. దీన్ని పరిష్కరించడానికి ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిననున్నట్టు సమాచారం. ప్రధాని మోదీ గత ఏడాది అక్టోబర్ 22న ఆస్తానాను సిబీఐ స్పెషల్ డైరెక్టర్గా స్వయంగా నియమించారు. గుజరాత్ కేడర్కు చెందిన ఆస్తానాపై అప్పటికే అవినీతి ఆరోపణలు ఉన్నందున ఆయన నియామకాన్ని సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ వ్యతిరేకించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. (సీబీఐ స్పెషల్ డైరెక్టర్పై కేసు) కేసు ఏమిటి? మాసం ఎగుమతి వ్యాపారవేత్త అయిన ఖురేషి సీబీఐ కేసుల నుంచి బయటపడేస్తానని చెప్పి డైరెక్టర్ల తరఫున పలువురి నుంచి లంచాలు తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన హెదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త సానా సతీష్ తాను ఖురేషికి 3 కోట్లు లంచంగా ఇచ్చినట్టు మేజిస్ట్రేట్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసు నుంచి తనను బయటపడేయడానికి గత పది నెలల్లో దఫదఫాలుగా ఈ సొమ్ము ఇచ్చానని, తాజాగా అక్టోబర్ 9వ తేదీన 25 లక్షలు ఇచ్చానని సతీష్ చెప్పారు. సతీష్ తన వాగ్మూలంలో సీబీఐ స్పెషల్ డైరెక్టర్ ఆస్తానా, దుబాయ్కు చెందిన వ్యాపారవేత్త మనోజ్ ప్రసాద్, ప్రసాద్ బంధువు సోమేశ్ల పేర్లు ప్రస్తావించారు. ఆస్తానా కోసమే ఈ సొమ్ము తీసుకుంటున్నట్టు ఖురేషి చెప్పారని కూడా సతీష్ పేర్కొన్నారు. అయితే, ఆస్తానాను తాను ప్రత్యక్షంగా కలవలేదని స్పష్టం చేశారు. దీని ఆధారంగా సీబీఐ ఆస్తానాపై కేసు నమోదు చేసింది. (సీబీఐ డీఎస్పీ అరెస్ట్) ఎవరీ ఖురేషీ? ఉత్తర ప్రదేశ్కు చెందిన మొయిన్ అక్తర్ ఖురేషీ డెహ్రాడూన్లోని డూన్ స్కూలు విద్యార్ధి. చదువయిపోయాకా 1993లో ఉత్తర ప్రదేశ్లోని రామ్పూర్లో చిన్న పశువధశాల ప్రారంభించాడు. అక్కడ నుంచి మాంసం ఎగుమతిదారుగా మారాడు. అనతి కాలంలోనే ఈ వ్యాపారంలో పేరు సంపాదించాడు. ఏళ్లు గడిచేకొద్ది నిర్మాణం, ఫ్యాషన్ వంటి వివిధ రంగాలకు విస్తరించాడు.పాతిక కంపెనీలకు పైగా నెలకొల్పాడు. ఆయనపై అనేక పన్ను ఎగవేత కేసులు ఉన్నాయి. హవాలా వ్యాపారం ద్వారా కోట్లు గడించాడు. సీబీఐ మాజీ డైరెక్టర్లు రంజిత్ సింగ్, ఏపీ సింగ్ తదితరులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకునేవాడు. వారి తరఫున సీబీఐ కేసుల్లో నిందితుల నుంచి ముడుపులు తీసుకునేవాడని ఈడీ ఆరోపించింది. ఖురేషీకి రాజకీయ ప్రముఖులతో కూడా సంబంధాలున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఆదాయం పన్ను శాఖలు ఖురేషీపై పలు కేసులు నమోదు చేశాయి. ఖురేషీపై ఉన్న కేసుల్లో దర్యాప్తు సాగకుండా సోనియా గాంధీ అడ్డుపడుతున్నారని 2014 లోక్సభ ఎన్నికల ప్రచారంలో మోదీ ఆరోపించిన సంగతి తెలిసిందే. దేశం నుంచి అక్రమంగా 200 కోట్లను విదేశాలకు తరలించాడని ఖురేషీపై ఈడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా సీబీఐ, ఈడీ, ఆదాయం పన్ను శాఖల అధికారులు ఖురేషీ నివాసాల్లో చేపట్టిన సోదాల్లో లభించిన డాక్యుమెంట్లు, సేకరించిన ఫోన్ సంభాషణల ఆధారంగా ఖురేషీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఖురేషీ కేసుల దర్యాప్తునకు ఏర్పాటయిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు ఆస్తానా అధిపతిగా వ్యవహరించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న సతీష్ను కేసు నుంచి తప్పించడం కోసం ఆస్తానా తరఫున ఖురేషీ 5.75 కోట్లు తీసుకున్నట్టు సీబీఐ కేసు నమోదు చేసింది. సతీష్ వాంగ్మూలం హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త సానా సతీష్ వాంగ్మూలం ఆస్తానాపై కేసుకు ప్రాతిపదికగా మారింది. ఖురేషీ కేసులో నిందితుడిగా ఉన్న సతీష్ అక్టోబర్ 4న స్థానిక మేజిస్ట్రేట్కు వాంగ్మూలం ఇస్తూ ఆస్తానా కోసం తాను ఖురేషీకి ఇంత వరకు 3 కోట్లు ఇచ్చానని చెప్పాడు. ఖురేషీ కేసులో విచారించడానికి సీబీఐ సెప్టెంబర్లో సతీష్కు సమన్లు పంపింది. ఆస్తానా ద్వారా ఈ సంగతి తెలుసుకున్న సతీష్ దుబాయ్ పారిపోవడానికి ప్రయత్నించాడు.అయితే,అప్పటికే సతీష్పై లుక్ ఔట్ నోటీసు జారీ కావడంతో విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. మోదీకి ఇష్టుడు ఆస్తానా ప్రధాని ఏరికోరి మరీ ఆస్తానాను సీబీఐ స్పెషల్ డైరెక్టర్గా నియమించారు. 1984 గుజరాత్ ఐపీఎస్ కేడర్కు చెందిన ఆస్తానా అంతకు ముంద సీబీఐ అదనపు డైరెక్టర్గా పని చేశారు. గోధ్రా రైలు దహనం కేసులో సిట్కు నాయకత్వం వహించారు. యూపీఏ హయాంలో జరిగిన ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్సెల్ మాక్సిస్ తదితర కేసుల దర్యాప్తుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఆస్తానా అధిపతిగా వ్యవహరించారు. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ తన ఎదుగుదలకు అడ్డుగా నిలుస్తున్నారని భావించిన ఆస్తానా ఆయనపై పలు ఆరోపణలు చేశారు. తన విధి నిర్వహణలో అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. ఖురేషీ కేసులో అలోక్ వర్మ లంచం తీసుకున్నారని కూడా ఆరోపించారు. వర్మపై 10 అవినీతిఆరోపణలతో కేబినెట్ కార్యదర్శికి లేఖ కూడా రాశారు. ఆయన ఈ వ్యవహరాన్ని విజిలెన్స్ కమిషన్కు అప్పగించారు. ఆస్తానా పై కేసుకు దారి తీసిన పరిణామాలు: కేసులోంచి తప్పించేందుకు లంచం ఇవ్వాలని ఆస్తానా డిమాండ్ చేశారంటూ హైదరాబాద్ వ్యాపారి సతీష్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆస్తానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాంట్లో సీబీఐ అధికారి దేవేంద్ర కుమార్, మధ్యవర్తి మనోజ్ ప్రసాద్, అతని సోదరుడు సోమేశ్ ప్రసాద్ల పేర్లు, మరికొందరు ప్రభుత్వాధికారుల పేర్లు ఉన్నాయి. ఎఫ్ఐఆర్ ప్రకారం... మనోజ్, సోమేశ్లు దుబాయ్లో సతీష్ను కలుసుకున్నారు. సీబీఐ అధికారి సహాయంతో సతీష్ కేసును సెటిల్ చేస్తామని వారు హామీ ఇచ్చారు. సోమేశ్ తనతో సీబీఐ అధికారితో ఫోన్లో మాట్లాడించాడని, ఐదు కోట్లు ఇస్తే కేసును సెటిల్ చేస్తానని ఆ అధికారి చెప్పారని, ముందుగా 3 కోట్లు అడ్వాన్సుగా ఇవ్వాలన్నారని సతీష్ ఆరోపించాడు. తనతో మాట్లాడింది రాకేశ్ ఆస్తానా అని సోమేశ్ చెప్పాడని కూడా సతీష్ పేర్కొన్నాడు. వాట్సాప్లో ఆస్తానా ఫోటో కూడా చూపించాడని తెలిపాడు. వారి మాటలు నమ్మి, కేసు నుంచి బయటపడాలన్న కోరికతో దుబాయ్లో మనోజ్ ప్రసాద్కు కోటి రూపాయలు ఇచ్చానని సతీష్ పేర్కొన్నాడు. తర్వాత సోమేశ్ చెప్పిన మేరకు ఢిల్లీలో సునీల్ మిట్టల్ అనే వ్యక్తికి 1.95 కోట్లు ఇచ్చానని సతీష్ వివరించాడు. అధికారులకు 2.95 కోట్లు లంచం ఇచ్చినప్పటికీ ఈ ఏడాది ఫిబ్రవరిలో సీబీఐ సతీష్కు నోటిసు పంపింది. దాంతో సతీష్ మనోజ్ను క లిసి లంచం ఇచ్చినా నోటీసులెందుకు వచ్చాయని నిలదీశాడు. మిగతా 2 కోట్లు ఇస్తే నోటీసు మాఫీ చేయిస్తానని మనోజ్ చెప్పాడు. గత నెల్లో సతీష్ హైదరాబాద్ నుంచి ఫ్రాన్స్ వెళ్లేందుకు ప్రయత్నించాడు. విమానాశ్రయం అధికారులు అతనిని వెళ్లకుండా ఆపారు. సెప్టెంబర్ 26న తమ ముందు హాజరు కావలసిందిగా సీబీఐ సతీష్ను ఆదేశించింది. అక్టోబర్ 1న సతీష్ ఢిల్లీలో సీబీఐ ముందు హాజరయ్యాడు. సీబీఐ డీఎస్పీ దేవేంద్ర కుమార్, ఎస్పి జాగ్రూప్లను కలుసుకున్నాడు. జరిగిందంతా సతీష్ మనోజ్కు చెప్పాడు.2 కోట్లు ఇవ్వకపోవడం వల్లే ఇలా జరిగిందని మనోజ్ చెప్పడంతో త్వరలోనే ఇస్తానని చెప్పాడు. అక్టోబర్ 9వ తేదీన 2 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చాడు.అనారోగ్యం వల్ల హాజరు కాలేకపోతున్నట్టు సతీష్ సీబీఐకి మెయిల్ పెట్టాడు. తర్వాత సీబీఐ నుంచి సతీష్కు ఎలాంటి సందేశాలు రాలేదు. సతీష్ అక్టోబర్ 10న 25 లక్షలు మనోజ్కు ఇచ్చాడని, మిగతా సొమ్ము అక్టోబర్ 16న ఇవ్వాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. అయితే అక్టోబర్ 16న సొమ్ము తీసుకోవడానికి భారత్ వచ్చిన మనోజ్ను సీబీఐ అరెస్టు చేసింది. దీని ఆధారంగా సీబీఐ ఆస్తానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -సాక్షి, నాలెడ్జ్సెంటర్ -
సీబీఐ స్పెషల్ డైరెక్టర్పై కేసు
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలతో సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్తానాపై అదే సంస్థ కేసు నమోదుచేసింది. సీబీఐలో రెండో అత్యున్నతాధికారిపై సీబీఐనే కేసు పెట్టడం ఇదే తొలిసారి. మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న మాంస వ్యాపారి మొయిన్ ఖురేషికి సాయం చేసేందుకు మధ్యవర్తి నుంచి అస్తానా లంచం తీసుకున్నారన్నది ఇక్కడ ప్రధాన ఆరోపణ అని అధికారులు తెలిపారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు ఖురేషి సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మకు రూ. 24 కోట్లు చెల్లించాడని అస్తానా ఆగస్టు 24న కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు. ఈ ఆరోపణలపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ విచారణ జరుపుతోంది. అప్పటి నుంచి అలోక్, అస్తానా వర్గాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్రతరమైన నేపథ్యంలో సీబీఐ అస్తానాపై నేరపూరిత కుట్ర, అవినీతి, నేర దుష్ప్రవర్తన తదితర ఆరోపణలపై కేసు నమోదుచేసింది. హైదరాబాద్కు చెందిన వ్యాపారి సతీశ్బాబు సనా ఫిర్యాదు మేరకు సీబీఐలోని అవినీతి నిరోధక విభాగం పలు సెక్షన్ల కింద అస్తానాతో పాటు మరికొందరిపై తాజా కేసు నమోదుచేసింది. -
బ్యాంకులకు రూ.1,700 కోట్ల టోపీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం, నెట్వర్కింగ్, పవర్ కన్వర్షన్ పరికరాల తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ వీఎంసీ సిస్టమ్స్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియానికి రూ.1,700 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టింది. పీఎన్బీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వీఎంసీతో పాటు, కంపెనీ ప్రమోటర్లు ఉప్పలపాటి హిమబిందు, ఉప్పలపాటి వెంకట రామారావు, బి.వెంకట రమణపై కేసు నమోదు చేసింది. వీరిపై నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ కేసులు పెట్టటమే కాక... వీఎంసీ సిస్టమ్స్ ఆఫీసుతో పాటు డైరెక్టర్ల నివాసాల్లో మొత్తం మూడు చోట్ల సోదాలు కూడా చేసింది. సంస్థకు హైదరాబాద్ దగ్గర్లోని రావిర్యాల వద్ద ప్లాంటు ఉంది. ఇక్కడ ఉత్పత్తయ్యే ఉపకరణాలను బీఎస్ఎన్ఎల్తోపాటు వివిధ కంపెనీలకు సరఫరా చేస్తోంది. ఆకాశ్ ట్యాబ్లెట్ల విషయంలో దేశవ్యాప్తంగా వివాదాల్లో చిక్కుకున్న డేటావిండ్తో ఈ కంపెనీకి గతంలో భాగస్వామ్యం ఉండేది. ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లను డేటావిండ్తో పాటు పలు కంపెనీలకు సరఫరా చేసింది. ఇవీ కేసు పూర్వాపరాలు.. నిర్వహణ మూలధనం కోసమని వీఎంసీ సిస్టమ్స్ 2009 ఆగస్టు 12న పీఎన్బీ, ఎస్బీఐ, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, జేఎం ఫైనాన్షియల్ అసెట్స్ రీకన్స్ట్రక్షన్ కంపెనీల నుంచి రూ.1,010.50 కోట్లు రుణంగా తీసుకుంది. ఈ రుణాలు చెల్లించకుండా డిఫాల్టయింది. బ్యాంకులు ఆరా తీయడంతో కంపెనీ అక్రమాలు బయటపడ్డాయి. రూ.1,010.50 కోట్ల నిర్వహణ మూలధన రుణాల్లో రూ.43.83 కోట్లను బ్యాంకుల అనుమతి లేకుండానే ఏప్రిల్ 2013– ఏప్రిల్ 2014 మధ్య వేరే బ్యాంకుల ఖాతాలకు మళ్లించింది. మిగతా నిధులను కూడా ఇలాగే వేరే ఖాతాలకు దారి మళ్లించి ప్రమోటర్లు స్వాహా చేసినట్టు సీబీఐకి పీఎన్బీ ఫిర్యాదు చేసింది. తీసుకున్న అప్పు ఇప్పుడు వడ్డీతో కలిపి రూ.1,700 కోట్లయింది. దీన్లో రూ.539 కోట్లు పీఎన్బీకే రావాలి. మిగిలిన రూ.1,207 కోట్లు ఎస్బీఐ, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, జేఎం ఫైనాన్షియల్ అసెట్స్ రీకన్స్ట్రక్షన్లకు రావాల్సి ఉంది. అన్నీ అబద్ధాలే.. అప్పులు తీర్చాలంటూ బ్యాంకులు ఒత్తిడి చేయడంతో వీఎంసీ ఏదో ఒక సాకు చెబుతూ వచ్చింది. బీఎస్ఎన్ఎల్ నుంచి తమకు రూ.262 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నట్టు చెప్పింది. అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు ఆరా తీయగా వీఎంసీకి తాము చెల్లించాల్సింది రూ.33 కోట్లు మాత్రమేనని బీఎస్ఎన్ఎల్ తేల్చి చెప్పింది. ఇంకా ఐటీఐ, న్యుట్రినో పవర్ సిస్టమ్స్, వీపీ సిస్టమ్స్ల నుంచి రూ.352.99 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉన్నట్టు వీఎంసీ చెప్పింది. ఎస్బీఐ అధికారులు దీనిపై ఆరా తీయగా, అవన్నీ అబద్ధాలేనని తేలటంతో.. పీఎన్బీ సీబీఐని ఆశ్రయించింది. బ్యాంకు రుణాలను ప్రమోటర్లు ఏయే ఖాతాలకు మళ్లించారనే అంశంపైనా సీబీఐ శోధిస్తోంది. -
కర్ణాటక మంత్రిపై మనీలాండరింగ్ కేసు
సాక్షి బెంగళూరు: ఆదాయ పన్ను ఎగవేత, నగదు అక్రమ రవాణా ఆరోపణలపై కర్ణాటక మంత్రి డీకే శివకుమార్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం కేసు నమోదు చేసింది. ఢిల్లీలోని కర్ణాటక భవన్ ఉద్యోగి హనుమంతయ్యతో పాటు మరికొందరిపై కూడా ఇదే కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో శివకుమార్ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హవాలా మార్గాల్లో కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరపడం, ఆదాయపన్ను ఎగవేత ఆరోపణలతో ఆదాయ పన్ను శాఖ బెంగళూరు ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన చార్జిషీటు ఆధారంగా ఈడీ చర్యలకు దిగింది. ఎస్.కె. శర్మ, సచిన్ నారాయణ్, ఎన్.రాజేంద్ర, ఆంజనేయ హనుమంతయ్యల సహకారంతో మంత్రి శివకుమార్ భారీమొత్తంలో అక్రమంగా నగదును తరలించినట్లు ఐటీ శాఖ చార్జిషీటులో పేర్కొంది. నిందితుల వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఈడీ త్వరలోనే సమన్లు పంపనుంది. ఆగస్టులో ఢిల్లీ, బెంగళూరుల్లోని శివకుమార్ నివాసాల్లో ఐటీ విభాగం జరిపిన దాడుల్లో లెక్కల్లో చూపని రూ.20 కోట్ల నగదు బయటపడిన సంగతి తెలిసిందే. -
సల్మాన్పై ఎఫ్ఐఆర్కు కోర్టు ఆదేశం
ముజఫర్పూర్: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్న ‘లవ్రాత్రి’ అనే సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్న ఫిర్యాదు రావడంతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా బిహార్లోని ఓ స్థానిక కోర్టు బుధవారం పోలీసులను ఆదేశించింది. లవ్రాత్రి పేరు హిందూ పవిత్ర పండుగ నవరాత్రులను పోలి ఉందనీ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకే ఈ సినిమాను అక్టోబర్ 5న విడుదల చేస్తున్నారన్న న్యాయవాది సుధీర్ కుమార్ ఫిర్యాదుపై కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. -
కమల్హాసన్పై కేసు
చెన్నై: సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్పై తమిళనాడులో కేసు నమోదైంది. కమల్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తమిళ బిగ్ బాస్–2 రియాలిటీ షోలో తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలితను అవమానించేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో కేసు నమోదైంది. లూయిసల్ రమేశ్ అనే లాయరు ఈ కేసు వేశారు. జయను ‘నియంత’తో పోల్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతో కావాలనే అమ్మపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. జయను కించపరుస్తూ ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. బిగ్బాస్లో నిర్వహించే టాస్కుల్లో భాగంగా ఒకరు డిక్టేటర్లా వ్యవహరించాల్సి వచ్చింది. వారాంతంలో ఆ టాస్క్పై చర్చ జరిపే క్రమంలో ‘రాష్ట్రాన్ని నియంతలా పాలించిన వారికి ఎలాంటి గతి పట్టిందో అందరికీ తెలుసు కదా’అని కమల్ వ్యాఖ్యానించారు. -
దినకరన్ ఇంటిపై దాడి
సాక్షి, చెన్నై: అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత, ఎమ్మెల్యే దినకరన్ ఇంటిపై ఆదివారం మధ్యాహ్నం పెట్రో బాంబు దాడికి యత్నం జరిగింది. ఈ ఘటనలో బాంబు విసిరిన వ్యక్తి సహా నలుగురు గాయపడ్డారు. చెన్నై బీసెంట్నగర్లో దినకరన్ నివాసం ఉంది. ఇటీవల పార్టీ పదవి నుంచి ఉద్వాసనకు గురైన కాంచీపురంనకు చెందిన పరిమళన్ తన కారులో పెట్రో బాంబులతో దినకరన్ ఇంటికి వచ్చాడు. కారును ఆపి, అందులో ఉన్న పెట్రో బాంబును దినకరన్ ఇంట్లోకి విసిరే యత్నం చేశాడు. అయితే, అది చేజారి కారులోనే పడింది. దీంతో అందులోని మిగతా పెట్రో బాంబులు అంటుకుని పేలడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న దినకరన్ వాహన డ్రైవర్, ఫొటోగ్రాఫర్, ఆటోడ్రైవర్ గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నమ్మించి మోసం చేసిన గుర్తు తెలియని వ్యక్తి
పరకాల : మాయమాటలతో వృద్ధురాలి మెడలోని రెండు తులాల పుస్తెల తాడు అపహరించిన సంఘటన ఆదివారం పరకాల పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. శాయంపేట మండలం జోగంపల్లి గ్రామానికి చెందిన గోరంట్ల కమలమ్మ అనే వృద్ధురాలు ఆదివారం సంత కావడంతో పరకాల పట్టణానికి చేరుకుంది. ఎండకు భరించలేక కాసేపు సేదతీరేందుకు బంగారం దుకాణం ముందు కూర్చున్న సమయంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి .. తెలిసిన వ్యక్తిలా ఎంతో అప్యాయంగా పలకరించాడు. ‘బాగున్నావా.. అంటే బాగున్నాను..’ అంటూ సమాధానం ఇచ్చింది. కొంతసేపు ముచ్చటపెట్టినట్టే పెట్టి తన భార్య ఫొటో దిగుతుందని..మెడలో పుస్తెల తాడు ఇస్తే మళ్లీ తీసుకొచ్చి ఇస్తానని నమ్మపలికాడు. అరగంట సేపయినా తిరిగి రాకపోవడంతో వృద్ధురాలు లబోదిబోమనటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ జానీ నర్సింహులు, ఎస్సై రవీందర్లు వృద్ధురాలు కూర్చున్న స్థలం వద్ద బంగారం దుకాణం ఉండటంతో సీసీ çఫుటేజీని పరిశీలించారు. వృద్ధురాలి మెడలో పుస్తెలు తాడు ఉన్న మాట వాస్తవంగా నిర్ధారణ చేసుకొని..మాయమాటలతో ఎత్తుకెళ్లిన వ్యక్తి గురించి గాలించారు. తెలిసిన వ్యక్తే వృద్ధురాలి పుస్తెలు తాడు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
సీఐడీ పోలీసుల పేరుతో లూటీ
కామారెడ్డి క్రైం: సీఐడీ పోలీసులమని చెప్పి ఓ వ్యక్తికి మత్తుమందు ఇచ్చి, అతని నుంచి బంగారు ఉంగరం, గొలుసు దోచుకున్న ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో గురువారం కేసు నమోదు చేశారు. పట్టణ ఎస్హెచ్వో శ్రీధర్కుమార్ కథనం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో పట్టణానికి చెందిన సుదర్శన్రావు నిజాంసాగర్ చౌరస్తాలోని ఓ వస్త్ర దుకాణం వద్దకు షాపింగ్కు వెళ్లాడు. అక్కడున్న ఇద్దరు వ్యక్తులు అతడిని అటకాయించి, తాము సీఐడీ అధికారులమని పరిచయం చేసుకున్నారు. పక్కకు తీసుకువెళ్లి, మత్తుమందు చల్లిన కర్చీఫ్ను అతడి ముఖానికి పెట్టడంతో సుదర్శన్రావు మత్తులోకి జారుకున్నారు. స్పృహా కోల్పోవడంతో దుండగులు అతడి ఒంటిపై ఉన్న గొలుసు, ఉంగ రం దోచుకొని పరారయ్యారు. షాక్ నుంచి కోలు కున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో వా రు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బంగారం షాపులో చోరీ
మరిపెడ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ఓ జ్యూలరీ షాపులో చోరీ జరి గింది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకా రం.. మునవర్ నాగేశ్వరరావుకు మరిపెడ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కనగల రామవిలాస్ వీధిలో శ్వేత జ్యూలరీ షాపు ఉంది. శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి గడ్డపారలతో దుకాణం షెట్ట ర్ను పైకి లేపి దోపిడీకి పాల్పడ్డారు. 46తులాల వెండి, 4కిలోల బంగారు ఆభరణాలు, రూ.50వేలు నగదు అపహరించారు. వీటి విలువ రూ. 15.10లక్షలు ఉంటుంది. అంతేకాకుండా షాపులో ఏర్పాటుచేసిన సీసీ కెమరాలను ధ్వంసం చేశారు. దొంగలను పట్టుకుంటాం.. వీలైనంత త్వరలోనే దొంగలను పట్టుకుంటామని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. మరిపెడ మండల కేంద్రంలో జరిగిన దొంగతనం వద్దకు పోలీస్ జాగిలాలను రప్పించి పరిశీలించారు. కాగా, ఇదే ప్రాంతంలో ఉన్న మరో సీసీ కెమెరాలో ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు కారులో వచ్చి బంగారు దుకాణంలోకి చొరబడుతున్నట్లు కనిపిస్తుందన్నారు. వీటికి సంబంధించి పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా దంతాలపల్లి మండలం బీరిశెట్టి గూడెం వద్ద రోడ్డు పక్కన చోరీ చేసిన బంగారు ఆభరణాలను తీసుకొని ఖాళీబాక్స్లు, చోరీకి ఉపయోగించిన గడ్డపారలు పడేసినట్లు గుర్తించామన్నారు. ఆయనతో పాటు తొర్రూర్ డీఎస్పీ రాజారత్నం, మరిపెడ సీఐ ఇస్లావత్ శ్రీనివాస్, ఎస్సైలు పవన్కుమార్, మద్దెల ప్రసాద్రావు తదితరులున్నారు. -
దళితుడిని కట్టేసి కొట్టి చంపారు
రాజ్కోట్ (గుజరాత్): చెత్త ఏరుకొని జీవనం సాగించే ఓ దళితుడిని తాడుతో కట్టేసి విచక్షణారహితంగా కొట్టి చంపిన ఘటన గుజరాత్లోని రాజ్కోట్లో చోటు చేసుకుంది. ముఖేష్ వనియా, తన భార్య జయాబెన్తో కలసి రాజ్కోట్లో చెత్త ఏరుకొని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం షాపర్లోని రాడాడియా ఫ్యాక్టరీ వద్ద దంపతులిద్దరు చెత్తను సేకరిస్తుండటాన్ని యజమాని గమనించాడు. వారిని దొంగలుగా అనుమానించిన ఆయన, తన నలుగురు స్నేహితులతో కలసి ముఖేష్ను తాడుతో కట్టేసి దారుణంగా కొట్టారు. తన భర్తను కొట్టవద్దని జయాబెన్ వేడుకున్నా కనికరించలేదు.. సరికదా ఆమెను కూడా కర్రలతో చావబాదారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ముఖేష్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందగా, జయాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. యజమాని జయకుష్తో పాటు మిగిలిన నిందితులను అదుపులోకి తీసుకున్నామని, వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని రాజకోట్(గ్రామీణ) ఇన్చార్జి ఎస్పీ శ్రుతి మెహతా తెలిపారు. దళితులకు గుజరాత్ క్షేమదాయకం కాదని పేర్కొంటూ ఇందుకు సంబంధించిన వీడియోను జిగ్నేశ్ మేవానీ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. కాగా, మృతుని కుటుంబానికి గుజరాత్ ప్రభుత్వం రూ.8.25 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించింది. -
పూలదుకాణం మాటున దొంగనోట్ల వ్యాపారం
బొబ్బిలి : బొబ్బిలి పట్టణంలో కలకలం రేపిన దొంగనోట్ల వ్యాపారుల ముఠాకు రాజకీయ అండదండలున్నాయా? పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు నిందితులను వదిలేయాలని పోలీసులపై స్థానిక నాయకులు ఒత్తిళ్లు చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి పట్టణంలోని మద్యం దుకాణాల్లో ఇటీవల కాలంలో దొంగనోట్ల చలామణీ జోరుగా సాగుతోంది. తరచూ మద్యం దుకాణాలు, ఇతర హోల్సేల్ దుకాణాల్లోకి వచ్చి చేరుతున్నాయి. ఇటీవల దీనిపై పోలీసులు నిఘా పెంచి దొంగనోట్లను చలామణీ చేస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మద్యం దుకాణాలు, ఇతర రద్దీగా ఉన్న హోల్సేల్ మార్కెట్లలోనే ఈ తతంగం గుట్టుచప్పుడుగా జరుగుతున్నట్టు గుర్తించారు. బొబ్బిలిలోని తాండ్రపాపారాయ జంక్షన్లో పూల దుకాణం నిర్వహిస్తున్న తిరుపతిరావును ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతనికి సహాయకుడిగా దుకాణంలో పనిచేస్తున్న షేక్పీర్, మరో వ్యక్తి తౌడులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. షేక్ పీర్ పట్టణంలోని పేదలుండే ఇందిరమ్మ కాలనీలో నివసిస్తూ అక్కడే దొంగనోట్లను భద్రపరచి చలామణి చేస్తున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే వీరిని పట్టుకున్న తరువాత బొబ్బిలి దాడితల్లి అమ్మవారి పండగ జరుగడం, పోలీసులకు విశ్రాంతి లేకపోవడం వంటి కారణాలతో పట్టుకున్న నిందితులను అరెస్టు ప్రకటించలేదని సమాచారం. విచారణలో వివిధ అంశాల పరిశోధనపై కూడా మరికాస్త సమయం అవసరమున్న నేపథ్యంలో డీఎస్పీ పి.సౌమ్యలత ఆదేశాలను సీఐ మోహనరావు, ఎస్సైలు వి.ప్రసాదరావు, బి.రవీంద్రరాజులు పాటిస్తున్నట్టు భోగట్టా. కొత్త నోట్లు వచ్చిన కొత్తలోనే..? కొత్త నోట్లు చలామణీకి వచ్చి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తున్న సమయంలోనే దొంగనోట్లను సిద్ధం చేసే సిద్ధహస్తులు బొబ్బిలిలోనే ఉన్నారా? లేక వీరి వెనుక ఇంకెవరయినా ఉన్నారా అన్నది ఇప్పడు పోలీసుల ముందున్న ప్రశ్న. దీనికి సమాధానం వెతికే పనిలో పోలీసులు తలమునకలై ఉన్నట్టు తెలుస్తోంది. వివిధ వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు అధికంగా ఉన్న బొబ్బిలిని దొంగనోట్ల చలామణికి అక్రమార్కులు ఎంచుకున్నట్టు తెలుస్తోంది. రాజకీయ ఒత్తిళ్లు..? పోలీసుల అదుపులో ఉన్నవారిని విడిపించేందుకు, కేసులు మాఫీ చేసేందుకు స్థానిక అధికార పార్టీ నేతలు పోలీసు అధికారులపై ఒత్తిళ్లు చేస్తున్నట్టు సమాచారం. ప్రధాన నిందితుడు తిరుపతిని కేసులోంచి బయటపడేసేందుకు ముగ్గురు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు ప్రయత్నిస్తున్నట్టు భోగట్టా. అయితే, పోలీసులు ఒత్తిళ్లను ఖాతరు చేయడం లేదని, దొంగనోట్ల చలామణిని ప్రోత్సహిస్తారా అంటూ సదరు నేతలను తిరిగి ప్రశ్నించినట్టు తెలిసింది. కేసులో మూలాలను వెతకడంలో భాగంగా పొరుగు జిల్లాలైన శ్రీకాకుళంలోని రాజాం, విశాఖపట్నంలకు వెళ్లినట్టు సమాచారం. -
ఆస్తికోసం తమ్ముడి కుటుంబంపై దాడి
చందంపేట నల్గొండ : ఆస్తుల కోసం మారుమూల గ్రామాల్లో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. రెండు ఎకరాల భూమి కోసం సొంత తమ్ముడు, తమ్ముడి కుమారుడు, తమ్ముడి భార్యను చంపేందుకు వెనుకాడ లేదు. వివరాల్లోకెళ్తే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన చందంపేట మండలం చిత్రియాల గ్రామపంచాయతీ పరిధిలో చో టు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రమావత్ చందు, గోప్య అన్నదమ్ములు. వీరికి తల్లిదండ్రుల ఆస్తి 25 ఎకరాలు ఉంది. తండ్రి మృతిచెందడంతో ఇరువురికి 11.5 ఎకరాల చొప్పున గతంలోనే పంచారు. రెండు ఎకరాల భూమిని తల్లి మోతి పేరున ఆమె బాగోగుల కోసం తనవద్దే ఉంచుకుంది. ఈ రెండు ఎకరాల భూమిని గోప్యకుమారుడు దేశు ఎవరికి చెప్పకుండా తన సొంతం చేసుకుని రెవెన్యూ అధికారులతో కలిసి పత్రాలు సృష్టించాడు. ఇది తెలుసుకున్న చందు కుమారుడు రమావత్ బాలు రెవెన్యూ అధికారులను వివరణ కోరగా దేశుపై భూమి రెండు ఎకరాల భూమి ఉందని చెప్పడంతో పెద్ద మనుషులను ఆశ్రయించాడు. పలుమార్లు ఇదే విషయంపై పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ కూడా నిర్వహించారు. గతంలో కూడా కేసులు అయినప్పటికీ ఈనెల 7వ తేదీన చందంపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో చందు, రమావత్ బాలులు ఫిర్యాదు చేశారు. ఈనెల 14న ఇరువర్గాలు రావాల్సిందిగా ఎస్ఐ కబురు పెట్టారు. 8వ తేదీ సాయంత్రం సమయంలో చందు, భార్య గ్వాలి, కుమారుడు బాలు ఇంట్లో ఉన్న సమయంలో గోప్య, దేశు, తుల్చా, లక్ష్మాలు దాడి చేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. మేమే చేశామంటూ .. కాగా చందు కుటుంబంపై మేమే దాడి చేశామంటూ వారి కుటుంబం చనిపోయిందంటూ గోప్య, దేశు, తుల్చా, లక్ష్మాలు చందంపేట మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు పుకార్లు వస్తున్నాయి. గ్రామంలో దాడితో భయాందోళన వాతావరణం నెలకొంది. గతంలో కూడా వారి కుటుంబంపై దాడి జరిగిందని చిత్రియాల గ్రామస్తులు పేర్కొంటన్నారు. ఇదే విషయమై ఎస్ఐ సతీష్కుమార్ను వివరణ కోరగా తాము రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బిజీగా ఉన్నామని, ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. ఇప్పటికే విచారణ కూడా చేపట్టామని పేర్కొన్నారు. -
బాలికపై ముగ్గురు మృగాళ్ల కీచక దాడి
దామరచర్ల (మిర్యాలగూడ) : ముగ్గురు మృగాళ్లు బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన దామరచర్ల మండలకేంద్రంలో గత నెలలో జరగగా, గురువారం వెలుగులోకి వచ్చింది. వాడపల్లి ఎస్ఐ యు.నగేష్ తెలిపిన వివరాల ప్రకారం... మండల కేంద్రానికి చెందిన బాలిక (14) గత నెల29న పనిపై బయటికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా అదేకాలనీకి చెందిన తాపీమేస్త్రీ షేక్ భాషా (22) ముందస్తు ప్రణాళికతో అటకాయించాడు. తన బైక్పై ఎక్కమని ఇంటివద్ద దింపుతానని నమ్మ బలికాడు. దీంతో బాలిక బైక్ ఎక్కింది. అనంతరం కాలనీ చివరన నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లోకి తీసుకెళ్లాడు. అప్పటికే అతని మిత్రులు మరో తాపీమేస్త్రీ షేక్ అల్లా బక్షి (22), లారీ క్లీనర్ చిన్నబోతుల రవి(21)లు అక్కడే కాపు గాసి ఉన్నారు. అనంతరం బాలికను బలవంతంగా ఒకరి తర్వాత ఒకరు లైంగికదాడి చేశారు. జరిగిన విషయం తల్లిదండ్రులకు చెబితే చంపేస్తామని బెదిరించారు. దీంతో ఆ బాలిక తనలోనే కుమిలిపోయి ఘటన జరిగినప్పటి నుంచి మౌనంగా ఉంటోంది. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి బాలికను అడగగా జరిగిన విషయం తెలిపి బోరున విలపించింది. తల్లి ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా బాలిక ఇటీవల స్థానికంగా 5వ తరగతి పూర్తి చేసుకుంది. -
పసికందు మాయం..
లంగర్హౌస్: పట్టపగలు తల్లితో కలిసి నిద్రిస్తున్న రెండు నెలల పసికందు అపహరణకు గురైన సంఘటన లంగర్హౌస్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ అంజయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జడ్చర్లకు చెందిన కవిత నగరానికి వచ్చి కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తుంది. ఇలా పరిచమైన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోగా నెలరోజుల క్రితం భర్త మరణించాడు. బుధవారం మధ్యాహ్నం కుమారుడితో కలిసి రాంలీలా మైదానంలోని చింతచెట్టు కింద నిద్రిస్తున్న ఆమె మెలుకువ వచ్చి చూసే సరికి బాబు కనిపించలేడు. దీంతో లంగర్హౌస్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
బాలికను ప్రేమలోకి దించిన యువకుడు
చీపురుపల్లి : అభం శుభం తెలియని ఓ పది హేనళ్ల బాలికను మాయమాటలతో ప్రేమ ముగ్గులోకి దించాడు ఓ యువకుడు. తాను చెబితే నడుచుకునేటట్టు చేశాడు. తనకు అనుకూలంగా ఉండే విధంగా పూర్తి స్థాయిలో నమ్మించాడు. కొద్దికాలంగా జరుగుతున్న ఈ తంతును చివరికి బాలిక తల్లిదండ్రులు పసిగట్టారు. పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న యువకుడు పరారీ అయ్యాడు. పోలీసులు ఆ యువకుడి కోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించి బొబ్బిలి డీఎస్పీ పి.సౌమ్యలత మంగళవారం వెల్లడించిన వివరాలు... చీపురుపల్లి పట్టణానికి చెందిన 15 సంవత్సరాల బాలిక గరివిడిలోని ఓ పాఠశాలలో గడిచిన విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతి చదివింది. రోజూ చీపురుపల్లి నుంచి గరివిడి పాఠశాలకు వెళ్లి వచ్చేది. ఆ బాలికను గరివిడికి చెందిన కె.రామ్వర్మ(22) అనే యువకుడు మాయ మాటలు చెప్పి నమ్మించి ప్రేమలో దింపాడు. బాలిక తల్లిదండ్రులకు తెలియకుండా ఆమెకు సెల్ఫోన్ కూడా ఇచ్చాడు. దీంతో పాఠశాలకు వెళ్లే సమయంలో...సెల్ఫోన్లోనూ బాలికతో ప్రేమాయణం సాగించాడు. చివరకు విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు చీపురుపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో బాలికను నమ్మించి మోసం చేసినందుకు పోక్సో చట్టం ప్రకారం రామ్వర్మపై కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ సౌమ్యలత తెలిపారు. మోసం చేసిన రామ్వర్మ పరారీలో ఉన్నాడని అతడిని పట్టుకునేందుకు గాలిస్తున్నట్టు చెప్పారు. -
గొంతుకోసి.. మెడ నరికి..
రాధేయపాలెం (రాజానగరం) : ఎప్పటిలాగే పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దండుగులు గొంతు కోసి, మెడ నరికి అతి కిరాతకంగా హతమార్చారు. వివాదరహితుడిగా పేరున్న ఈ వ్యక్తిని ఎవరు హతమార్చారో తెలియక పోలీసులు సైతం తలలు పట్టుకుంటున్నారు. రాజానగరం మండలం, రాధేయపాలెంలో గురువారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల కథనమిలా.. రాధేయపాలేనికి చెందిన గోసాల సత్యనారాయణ (57) గ్రామ శివారున ఉన్న పొలంలో నాలుగేళ్లుగా కాపలా ఉంటున్నాడు. రాజమహేంద్రవరానికి చెందిన అంకం గోపి అనే వ్యక్తి కొనుగోలు చేసిన 18 ఎకరాల పొలంలో ఎనిమిది ఎకరాల వరకు రిజిస్టర్ కావడం, మిగిలిన 10 ఎకరాలు సకాలంలో రిజిస్ట్రేషన్ కాకపోవడంతో క్రయ, విక్రయదారుల మధ్య తలెత్తిన వివాదం కోర్టు వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో మొదట కుదుర్చుకున్న అగ్రిమెంటు ప్రకారం అంకం గోపి ఆధీనంలో ఉన్న ఈ పొలంలో కాపలాదారుడిగా సత్యనారాయణను నియమించారు. అప్పటి నుంచి తన విధులు తాను చేసుకుపోతున్న అతడికి అవతలి వర్గం నుంచి కూడా ‘నీవు కాపలాగా ఉండవద్దు’ అంటూ బెదిరింపులు వచ్చాయి. అయితే వాటిని పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్న హతుడు పామాయిల్ తోటకు నీళ్లు పెట్టేందుకు ఉదయం ఆరు గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన రేలంగి శ్రీనును తీసుకువెళ్లాడు. పామాయిల్ తోటకు నీరు పెట్టిన అనంతరం టిఫిన్ తీసుకురమ్మని అతడిని పంపాడు. టిఫిన్ తీసుకుని తిరిగి వెళ్లే సరికి చనిపోయి రక్తపు మడుగులో మృతి చెంది ఉన్న సత్యనారాయణను చూసి భయంతో ఊళ్లోకి పరుగు తీసి, విషయాన్ని అందరికీ తెలిపాడు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులతోపాటు డీఎస్పీ నాగరాజు, రాజానగరం సీఐ వరప్రసాద్, ఎస్సై జగన్మోహన్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. జరిగిన సంఘటనపై నిజానిజాలు తెలుసుకునేందుకు డాగ్ స్క్వాడ్ని రప్పించారు. అయితే అక్కడి నుంచి కొద్ది దూరం వెళ్లిన స్కాడ్ మరలా వెనక్కి వచ్చేయడంతో క్లూస్ దొరకలేదు. మృతుడి కుటుంబానికి పరిహరం చెల్లించాలి.. మృతదేహానికి పోస్టుమార్టం చేయించేందుకు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా అక్కడికి చేరుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు మృతుడి కుటుంబానికి పరిహరం చెల్లించి, మృతదేహాన్ని కదిలించాలని పట్టుబట్టారు. పొలంలో కాపాలాగా నియమించడంలో మధ్యవర్తిగా ఉన్న మాజీ సర్పంచ్ నాగమునేశ్వరరావును కూడా ఈ విషయమై నిలదీశారు. చివరకు పొలం స్వాధీనంలో ఉన్న అంకం గోపి గ్రామాంతరంలో ఉండడంతో వేరొకరు ప్రతినిధిగా వచ్చారు. మృతుడి కుటుంబానికి రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు పొలం యజమాని వైపు నుంచి స్పందన రాకపోవడంతో విషయం తేలేవరకు మృతదేహాన్ని అక్కడి నుంచి కదలనిచ్చేది లేదంటూ పట్టుబట్టారు. పోలీసులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉభయ వర్గాలతో సంప్రదింపులు చేస్తున్నారు. కేసును రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు
పాకాల: మండలంలోని కె.వడ్డేపల్లి పంచాయతీ పోలిరెడ్డివారిపల్లిలో ఈ నెల 5వ తేదీన మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిం దితుడిని అరెస్టు చేసినట్టు సీఐ రామలింగయ్య తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ పోలిరెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన లేట్ సుబ్రమణ్యం కుమారుడు హేమసుందరం(21) పక్క ఇంటి వారి పశువులకు గడ్డి వేసేందుకు వెళ్లాడని తెలిపారు. ఆ సమయంలో అక్కడ నిస్సహాయ స్థితిలో ఉన్న మానసిక దివ్యాంగురాలి(29)పై అత్యాచారానికి ఒడిగట్టాడని చెప్పారు. బాధితురాలి వదిన దుశ్చర్యని చూసి కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడన్నారు. ఎస్ఐ యు.వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేపట్టారని తెలిపారు. నిందితుడు సోమవారం నేండ్రగుంట వద్ద ఉండగా అరెస్టు చేసినట్టు వివరించారు. అతన్ని కోర్టుకు హాజరుపరిచామని తెలిపారు. -
వీఆర్ఎస్ కాలువలోమృతదేహం
మక్కువ: మండలంలోని సరాయివలస గ్రామానికి చెందిన గులిపల్లి సన్యాసినాయుడు (45) అనుమానస్పదంగా మృతి చెందాడు. గ్రామస్తులు, కుటంభసభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం... సన్యాసినాయుడు ఈ నెల 5వ తేదీ రాత్రి 9గంటల సమయంలో పొలానికి నీరు కట్టేందుకు వెళ్లాడు. మరుచటి రోజు కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు.ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు వీఆర్ఎస్ కాలువలో మృతదేహం తేలాడాన్ని గుర్తించి కుటంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్సై వెలమల ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అనుమానాలు.. నాలుగు రోజులుగా సన్యాసినాయుడు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గరయ్యారు. ఇంటి వద్ద ఎటువంటి గొడవలు లేకపోవడంతో ఆత్మహత్య చేసుకునే అఘాయిత్యం లేదనిపిస్తోంది. నీరు పెట్టే సమయంలో ఎవరితోనైనా గొడవలు జరిగాయా..? వారే హత్య చేసి కాలువలో పడేశారా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల విచారణలో ఏమి తేలుతుందోనని గ్రామస్తులు వేచి చూస్తున్నారు. -
తల్లిదండ్రులు మందలించారని బాలుడు అదృశ్యం
మైలార్దేవ్పల్లి: బుద్దిగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి పారిపోయాడు. ఈ సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మైలార్దేవ్పల్లి ప్రాంతానికి చెందిన మహేష్కుమార్ కొడుకు ఎం.మధుకుమార్ (12) స్థానికంగా ఉన్న సెయింట్ మేరీస్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. పరీక్షలు సమీపిస్తుండటంతో మధుకుమార్ చదువును నిర్లక్ష్యం చేస్తూ ఆటపాటలతో సమయం వృథా చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పరీక్షలకు మంచిగా చదువుకోవాలని మందలించడంతో ఈ నెల 3న రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి పారిపోయాడు. విషయం గ్రహించిన తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసిన ఆచూకీ తెలియకపోవడంతో మైలార్దేవ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మంచిర్యాలలో వ్యభిచారం
మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా కేంద్రంలో మరో వ్యభిచారం ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పట్టణంలోని హమాలీవాడలో ఓ మహిళ వ్యభిచారం నడిపిస్తుందన్న సమాచారం మేరకు పట్టణ ఎస్సై శ్రీనివాస్యాదవ్ సిబ్బందితో కలిసి వ్యభిచార స్థావరంపై దాడిచేశారు. నిర్వాహకురాలితోపాటు ముగ్గురు విటులు, బెంగళూర్కు చెందిన ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. పెద్దపెల్లి జిల్లా కమాన్పూర్కు చెందిన పెండ్యాల సంతోష్, నాగరాజు, కార్తీక్లతోపాటు నిర్వాహకురాలు, బెంగళూర్కు చెందిన ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణాపూర్కు చెందిన ఓ మహిళ మంచిర్యాలలో అద్దెకు ఉంటూ టైలరింగ్ నిర్వహిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో వ్యభిచారంలోకి దిగిం ది. తనతోపాటు మరికొంత మందిని హైదరాబాద్, బెంగళూర్, విజయవాడ ప్రాంతాల నుంచి మహిళలను పిలిపించి మంచిర్యాలలో వ్యభిచారం నడిపిస్తున్నట్లు వివరించింది. ప్రస్తుతం పోలీసుల అ అదుపులో ఉన్న బెంగళూర్కు చెందిన యువతి రైలులో పరిచయం అయిందని, ఆమె ఆర్థిక పరిస్థితిని వివరించగా చేరదీశానని తెలిపింది. ఈ మేరకు ఎస్సై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుడి దారుణ హత్య
మెదక్రూరల్: ప్రేమించిన పాపానికి ఇంత కిరాతకంగా చంపేస్తారా..? అంటూ మృతుడి బంధువులు రోదించిన తీరు అందరిని కలచివేసింది. బండరాయితో మోదీ ముఖాన్ని గుర్తుపట్టరానంతగా చిధ్రం చేసి , శరీరంపై కత్తితో పొడిసి, మర్మాంగాలపై రాళ్లను పడేసి అతీ కిరాతకంగా హతమార్చిన సంఘటన మెదక్ మండలం ఖాజీపల్లి శివారులో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ పట్టణం దాయర వీధికి చెందిన మహ్మద్ గఫ్ఫర్ఖాన్–ఆసియాలకు ఇద్దరు కుమారులున్నారు. రెండో కుమారుడు మోహీన్ఖాన్(22) రెండు నెలల క్రితం పట్టణానికి చెందిన ఓ యువతిని ప్రేమించి ఇతర ప్రాంతానికి కొద్ది రోజులు తీసుకెళ్లారని, ఆ తర్వాత ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆ యువతిని తీసుకొచ్చి అప్పగించినట్లు తెలిపారు. ఈ విషయంలో మోహీన్పై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి మెదక్ కోర్టులో సోమవారం పేషీకి హాజరై రాత్రి 8 గంటలకు హైదరాబాద్కు బస్లో తిరుగు పయాణమయ్యాడు. బస్సులో ప్రయాణించాల్సిన మోహీన్ మెదక్–చేగుంట ప్రధాన రహదారి పక్కన ఖాజీపల్లి గ్రామ శివారులో దుండగుల చేతిలో అతికిరాతకంగా హత్యకు గురయ్యాడు. శరీరంపై కత్తితో పోడిసి, ముఖాన్ని గుర్తుపట్టరాని విధంగా బండరాయితో మోది కిరాతకంగా చంపేసి రోడ్డు పక్కనే పడేశారు. ప్రేమ వ్యవహారమే హత్యకు దారితీసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమిస్తే చంపుతారా..? హత్య జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో ఉన్న ఏపీ13జీ7809 ఇండికా కారును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ప్రేమించిన పాపానికే చంపేసి ఉంటారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే మోహీన్పై ఇప్పటికే హత్యాయత్నం, అత్యాచారం కింద రెండు కేసులు ఉన్నట్లు పోలీసులు చెపుతున్నారు. మెదక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ రామకృష్ణ, ఎస్లు లింబాద్రి, శ్రీకాంత్, సందీప్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. క్లూస్టీం బృందం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యానేరంగా పోలీసులు కేసు నమోదుచేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. ఈ క్రమంలో మృతుడి బంధువులు నిందితులను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అడ్డుకున్నారు. దీంతో త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు నచ్చజెప్పి పోస్టుమార్టంకి తరలించారు. -
కొడుకును కడతేర్చిన తండ్రి
ఎర్రుపాలెం: కన్న కొడుకును తండ్రి హత్య చేసిన సంఘటన ఎర్రుపాలెం మండలం వెంకటాపురం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గంధసిరి లక్ష్మయ్య, ప్రభాకర్(30) తండ్రీ కొడుకులు. ఒకే ఇంట్లో ఉంటున్న ఇద్దరూ లారీ డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నారు. రోజూ ఇద్దరు మద్యం సేవించి గొడవలకు దిగడం పరిపాటి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఇద్దరూ గొడవపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన తండ్రి లక్ష్మయ్య తన భార్యతో కలిసి అదే గ్రామంలోని ఓ ఇంట్లో తలదాచుకున్నాడు. అయితే ప్రభాకర్ భార్య అంజలితో మనస్పర్థలుండటంతో ఆమె ఐదు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా.. తండ్రి లక్ష్మయ్య అర్ధరాత్రి బహిర్భూమికి వెళ్తున్నానని భార్యకు చెప్పి.. కొడుకు ప్రభాకర్ నిద్రిస్తున్న సొంత ఇంటికి వచ్చాడు. గాఢ నిద్రలో ఉన్న కొడుకు తలపై కర్రతో తీవ్రంగా కొట్టాడు. రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే ప్రభాకర్ మృతిచెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ప్రభాకర్ భార్య పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ ఆంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేసి.. కేసు నమోదు చేశారు. మధిర సీఐ శ్రీధర్కి సమాచారం ఇవ్వడంతో ఆయన హత్య జరిగిన ప్రదేశానికి వచ్చి విచారించారు. హత్య కేసులో సమగ్రమైన దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. -
బైక్ పైనుంచి దూకిన మహిళ మృతి
తొగుట(దుబ్బాక): బైక్ పైనుంచి దూకి గాయపడిన మహిళ సోమవారం మరణించిందని తొగుట ఎస్ఐ మధుసూదన్రెడ్డి తెలిపారు. మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన నరెడ్ల భారతమ్మ (50) రోజూ సిద్దిపేటలో భవన నిర్మాణ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం సిద్దిపేటకు వెళ్లి తిరిగి వచ్చేందుకు ఘణపురం వెళ్లే ఆటోలో మెట్టు వరకు వచ్చింది. అక్కడ మరో ఆటోకోసం ఎదురుచూస్తున్న క్రమంలో వేములఘాట్ మదిర తుర్కబంజేరుపల్లికి చెందిన ఇరుగదిండ్ల ప్రశాంత్ బైక్ ఎక్కింది. ఈ క్రమంలో అతడు ఎల్లారెడ్డిపేట స్టేజీ వద్ద బైక్ ఆపకుండా వెళ్తున్నాడు. దీంతో భయాందోళనకు గురైన భారతమ్మ బైక్ పైనుంచి కిందకు దూకింది. ఈ క్రమంలో ఆమె తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఆమెను ప్రశాంత్ చికిత్స కోసం సిద్దిపేటకు తరలించాడు. పరిస్థితి విషమంగా మారడంతో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రజ్ఞాపూర్ వద్ద భారతమ్మ మృతిచెందింది. ఆమె భర్త ఫిర్యాదు మేరకు శవాన్ని పోస్టుమార్టం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ వివరించారు. -
భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
జహీరాబాద్ టౌన్: భర్త వేధింపులు భరించలేక వివాహిత బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని జహీరాబాద్ రూరల్ ఎస్ఐ. శ్రీకాంత్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రంజోల్ గ్రామానికి చెందిన లక్ష్మయ్య చిన్న కూతురు గుండమ్మ(19)ను ఝరాసంగం మండలంలోని కంకర్వాడ గ్రామానికి చెందిన బోయిని విఠల్ (30)కు ఇచ్చి నాలుగు నెలల కిత్రం పెళ్లి చేశారు. పెళ్లయిన నాటి నుంచి భర్త గుండమ్మను వేధిస్తున్నాడు. మద్యం తాగి శారీరకంగా, మానసికంగా వేధిస్తుండడంతో గ్రామస్తుల సమక్షంలో పంచాయతీ పెట్టించారు. ఇక నుంచి ప్రవర్తన మార్చుకోవాలని, మద్యం తాగడం మాని వేయాలని గ్రామ పెద్దలు విఠల్ను ఒప్పించారు. అయినా అతడిలో మార్పురాలేదు. యథావిధిగా మద్యం తాగి భార్యను కొట్టడంతో జీవితంపై విరక్తి చెందిన గుండమ్మ రంజోల్ గ్రామ సమీపంలోని ఓ బావిలో దూకి సోమవారం ఆత్మహత్య చేసుకుంది. తల్లి వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శ్రీకాంత్ వివరించారు. -
సీబీఎస్ఈ పేపర్ లీక్.. రీ–ఎగ్జామ్
న్యూఢిల్లీ: ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో రెండు పరీక్షలను మళ్లీ నిర్వహించాలని (రీ–ఎగ్జామ్) సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) బుధవారం నిర్ణయించింది. పదవ తరగతి విద్యార్థులకు గణిత శాస్త్రం, పన్నెండవ తరగతి విద్యార్థులకు ఎకనామిక్స్ పరీక్షలను మళ్లీ నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ పరీక్షల తేదీల వివరాలను వారం రోజుల్లో తమ వెబ్సైట్లో ఉంచుతామని సీబీఎస్ఈ ఓ సర్క్యులర్లో పేర్కొంది. ఈ లీకేజీ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ‘కొన్ని పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన వార్తలను మేం పరిగణనలోకి తీసుకుంటున్నాం. విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనను దృష్టిలో ఉంచుకుని, పరీక్షల పవిత్రతను కాపాడటం కోసం రెండు సబ్జెక్టులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తాం’ అని సర్క్యులర్లో సీబీఎస్ఈ తెలిపింది. 12వ తరగతికి సోమవారం జరిగిన ఆర్థిక శాస్త్రం పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయ్యిందని సామాజిక మాధ్యమాల్లో కొందరు పోస్టులు చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. అయితే తాము అన్ని పరీక్షా కేంద్రాల నుంచీ సమాచారం తెప్పించుకున్నామనీ, పేపర్ లీక్ కాలేదని సీబీఎస్ఈ అప్పుడే స్పష్టం చేసింది. పరీక్షల ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు దుండగులు పేపర్ లీక్ అయినట్లుగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు పెట్టి ఉంటారని సీబీఎస్ఈ పేర్కొంది. 12వ తరగతికే చెందిన అకౌంటెన్సీ పరీక్ష ప్రశ్నపత్రం కూడా లీక్ అయినట్లు తమకు ఫిర్యాదులు అందాయని మార్చి 15నే ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. అలాంటిదేమీ లేదని సీబీఎస్ఈ వివరణ ఇచ్చినా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సోమవారం నుంచి కొత్త పద్ధతి.. ప్రశ్నప్రతాలు లీక్ అవుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో సోమవారం నుంచి కొత్త పద్ధతిలో క్వశ్చన్ పేపర్లను పంపిణీ చేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. అలాగే లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వం అంతర్గతంగా విచారణ జరుపుతోందన్నారు. ‘సీబీఎస్ఈకి దృఢమైన వ్యవస్థ ఉంది. అయినా పేపర్లు లీక్ అవుతుంటే, లేదా వ్యవస్థలో ఏదైనా లోపముంటే.. వాటిని సరిదిద్దేందుకు సోమవారం నుంచి కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టబోతున్నాం’ అని జవదేకర్ చెప్పారు. లీకేజీ వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏం మాట్లాడారని అడగ్గా.. ప్రధానికి అన్ని వివరాలనూ తాను అందించాననీ, ఒత్తిడి లేకుండా పరీక్షలు నిర్వహించాలని మోదీ ఎప్పుడూ అంటుంటా రని జవదేకర్ చెప్పారు. పరీక్షల నిర్వహణను మోదీ ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారన్నారు. -
మమతపై కేసు
గువాహటి/కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అసోంలో గురువారం కేసు నమోదైంది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్ఆర్సీ) పేరిట అసోం నుంచి బెంగాలీలను తరిమేసేందుకు కేంద్రం కుట్రపన్నుతోందన్న ఆమె ఆరోపణలపై ఫిర్యాదులు అందడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ప్రజల మధ్య విద్వేషం రెచ్చగొట్టేలా మమత మాట్లాడారని గువాహటి, దిస్పూర్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. మమత వ్యాఖ్యలను అసోం ప్రభుత్వం ఖండించింది. ఇలాంటి ఆరోపణలు అసోం ప్రజలు, భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కించపరిచేలా ఉన్నాయని, ఆమెకు వ్యతిరేకంగా సుప్రీంలో ఫిర్యాదు చేయాలని ఎన్ఆర్సీ అధికారులను కోరింది. అసోంలో పలు చోట్ల మమత దిష్టిబొమ్మలను దహనం చేశారు. బెంగాల్లో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. కేసులకు భయపడి మమత తన పోరాటం ఆపరని టీఎంసీ తేల్చిచెప్పింది. రాజకీయ ప్రయోజనాల కోసమే మమత కొత్త సమస్యను సృష్టిస్తున్నారని బీజేపీ మండిపడింది. పశ్చిమబెంగాల్లోని అహ్మద్నగర్లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో మమత మాట్లాడుతూ...ఎన్ఆర్సీ ముసాయిదాలో బెంగాలీల పేర్లు చేర్చకుండా వారిని అసోం నుంచి తరిమేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వ్యాఖ్యానించారు. అక్రమ వలసదారుల్ని గుర్తించేందుకు గత డిసెంబర్ 31న ఎన్ఆర్సీ తొలి జాబితాను విడుదల చేయగా.. భారత పౌరులుగా సుమారు 3.30 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. 1.90 కోట్ల మందికి అందులో చోటు దక్కింది. -
మహిళలకు కుచ్చుటోపీ!
అధిక వడ్డీ ఆశచూపి నగదు వసూలు ఆందోళనకు దిగిన బాధితులు పోలీసుల అదుపులో దంపతులు రామచంద్రాపురం : అధిక వడ్డీ ఆశచూపి కుచ్చుటోపీ పెట్టిన ఓ మహిళను రామచంద్రాపురం పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం... బెంగళూరుకు చెందిన భారతి, వీరేందర్సింగ్లు దంపతులు. వీరు ఏడాదిన్నర క్రితం అమీన్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లారెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. ఓ ఇంటిని అద్దెకు తీసుకొని అందులో జ్యువెలరీ, గృహాలంకరణ వస్తువుల విక్రయంతోపాటు బట్టల దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఓ వస్తువుకొంటే మరో వస్తువు ఉచితమంటూ ప్రచారం చేశారు. అదీగాక రూ.లక్ష రూపాయలిస్తే రోజుకు రూ. 5 వేల వడ్డీని ఇస్తామని మహిళలకు ఆశచూపారు. నమ్మిన స్థానిక మహిళలు పెద్ద ఎత్తున నగదు, బంగారాన్ని భారతికి ఇచ్చారు. తమ డబ్బులు తమకివ్వాలంటూ గత రెండు రోజులుగా బాధితులు ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చారు. గురువారం రాత్రి బాధితులు ఒక్కసారిగా ఆమె ఇంటి వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారతి దంపతులను అదుపులోకి తీసుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ సుమారు 200 మంది బాధితులు పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
బెల్ట్షాప్ నిర్వాహకులపై కేసు నమోదు
దౌల్తాబాద్, న్యూస్లైన్: దౌల్తాబాద్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో బెల్ట్షాప్లు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన చుంచనకోట నర్సాగౌడ్, కీసర అంజాగౌడ్లు వారి హోటళ్లలో మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో సోమవారం రాత్రి దాడి చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఆయా హోటళ్లలో మద్యం బాటిళ్లు లభించగా, వాటిని స్వాధీనం చేసుకుని హోటళ్ల యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.