బంగారం షాపులో చోరీ   | Theft in the gold shop | Sakshi
Sakshi News home page

బంగారం షాపులో చోరీ  

May 26 2018 12:06 PM | Updated on Aug 30 2018 5:27 PM

Theft in the gold shop - Sakshi

చోరీ జరిగిన దుకాణంలో విచారిస్తున్న ఎస్పీ

మరిపెడ :  మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ఓ జ్యూలరీ షాపులో చోరీ జరి గింది. బాధితుడు,  పోలీసుల కథనం ప్రకా రం.. మునవర్‌ నాగేశ్వరరావుకు మరిపెడ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కనగల రామవిలాస్‌ వీధిలో శ్వేత జ్యూలరీ షాపు ఉంది. శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి గడ్డపారలతో దుకాణం షెట్ట ర్‌ను పైకి లేపి దోపిడీకి పాల్పడ్డారు.

46తులాల వెండి, 4కిలోల బంగారు ఆభరణాలు, రూ.50వేలు నగదు అపహరించారు. వీటి విలువ రూ. 15.10లక్షలు ఉంటుంది. అంతేకాకుండా షాపులో ఏర్పాటుచేసిన సీసీ కెమరాలను ధ్వంసం చేశారు. 

దొంగలను పట్టుకుంటాం.. 

వీలైనంత త్వరలోనే దొంగలను పట్టుకుంటామని మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు.  మరిపెడ మండల కేంద్రంలో జరిగిన దొంగతనం వద్దకు పోలీస్‌ జాగిలాలను రప్పించి పరిశీలించారు. కాగా, ఇదే ప్రాంతంలో ఉన్న మరో సీసీ కెమెరాలో ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు కారులో వచ్చి బంగారు దుకాణంలోకి చొరబడుతున్నట్లు కనిపిస్తుందన్నారు.

వీటికి  సంబంధించి పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి  గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా దంతాలపల్లి మండలం బీరిశెట్టి గూడెం వద్ద రోడ్డు పక్కన చోరీ చేసిన బంగారు ఆభరణాలను తీసుకొని ఖాళీబాక్స్‌లు, చోరీకి ఉపయోగించిన గడ్డపారలు పడేసినట్లు గుర్తించామన్నారు. ఆయనతో పాటు తొర్రూర్‌ డీఎస్పీ రాజారత్నం, మరిపెడ సీఐ ఇస్లావత్‌ శ్రీనివాస్, ఎస్సైలు పవన్‌కుమార్, మద్దెల ప్రసాద్‌రావు తదితరులున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement