ఇద్దరు ఆజాద్‌ దళ సభ్యుల అరెస్ట్‌ | Two Naxals Of New Democracy Group Surrender In Palwancha | Sakshi
Sakshi News home page

Apr 28 2018 6:48 AM | Updated on Oct 17 2018 3:43 PM

Two Naxals Of New Democracy Group Surrender In Palwancha - Sakshi

వివరాలను వెల్లడిస్తున్న ఓఎస్‌డీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి

సాక్షి, పాల్వంచరూరల్‌: సీపీఐ (ఎంఎల్‌ న్యూడెమోక్రసీ) ఆజాద్‌ దళానికి చెందిన ఇద్దరు అజ్ఞాత దళ సభ్యులను, ఒక తుపాకీతో పాటు అరెస్ట్‌చేశారు. వారి వద్ద నుంచి రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం సీఐ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో   ఓఎస్డీ ఉదయ్‌కుమార్‌రెడ్డి వివరాలను వెల్లడించారు. మండల పరిధిలోని ఉల్వనూరు బంజర, ఉల్వనూరు గ్రామాలకు చెందిన పూనెం నర్సింహారావు, అలియాష్‌ రమేష్, నెట్టి అమృతరావు కొంతకాలంగా ఎన్డీ ఆజాద్‌ దళంలో అజ్ఞాత దళ సభ్యులుగా పనిచేస్తున్నారు.

గురువారం రాత్రి ఎస్‌ఐ అనిల్‌ పెట్రోల్‌ నిర్వహిస్తుండగా బం జర ఏరియాలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా అనుమానాస్పద స్థితిలో కన్పించిన ఇరువురుని అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది. నర్సింహారావు 1998–2005 వరకు జనశక్తి గ్రూపు రాజన్న దళంలో పనిచేశాడు. 2005లో పోలీసులకు లొంగిపోయిన తర్వాత మళ్లీ ఎన్డీ రాయల వర్గంలో ఆర్గనైజర్‌గా పనిచేస్తూ ఆజాద్‌ దళంలో పని చేస్తున్నాడు. అతని వద్ద  303 తూపాకీ, రైఫిల్‌ బుల్లెట్లు 30, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.  సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ.రాఘవేంద్రరావు, ఎస్‌ఐ.అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement