నర్సింహులపేట: అప్పుల బాధ ఇద్దరు రైతుల ప్రాణం తీసింది. పంట దిగుబడి లేక, పెట్టిన పెట్టుబడులు కూడా రాక అప్పులు పేరుకుపోవడంతో తీర్చే మార్గం లేక మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం శివారు జగ్యాతండాకు చెందిన కౌలు రైతు భూక్య హెమోజీ(48) గత రెండు సంవత్సరాలుగా నాలుగు ఎకరాల భూమి కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు.
పంట దిగుబడి లేక వచ్చిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పులు చేశాడు. అలాగే ఆరు నెలల క్రితం తన కుమారుడు వాసు రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతిచెందాడు. అతడికి ఆస్పత్రిలో చికిత్స కోసం కూడా తెలిసినవారినల్లా డబ్బులు అడిగాడు. దీంతో అతడికి రూ.4 లక్షల మేర అప్పులయ్యాయి. ప్రస్తుతం ఎకరం భూమిలో టమాట సాగు చేశాడు. మంగళవారం సాయంత్రం తొర్రూరు సంతకు వెళ్లి టమాటాలు విక్రయించి రాత్రి ఇంటికి చేరుకున్నాడు.
లక్షలాది రూపాయల అప్పు ఎలా తీర్చాలని మనోవేదనకు గురైన అతడు బుధవారం వ్యవసాయ భూమిలో వేపచెట్టుకు ఉరివేసుకొని అత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, కూతరు ఉన్నారు. ఎస్సై నగేష్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి భార్య మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మల్లెంపల్లిలో..
మల్హర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం నాచారం పరిధిలోని మల్లెంపల్లికి చెందిన జింకల రవి(42) తనకున్న ఆరు ఎకరాల్లో నాలుగు ఎకరాలు మిర్చి, రెండు ఎకరాలు పత్తి సాగు చేశాడు. గత నాలుగేళ్లుగా పండించిన పంటలకు పెట్టుబడి పెరగడంతోపాటు దిగుబడి సక్రమంగా రాకపోవడంతో రూ.5 లక్షల వరకు అప్పులయ్యాయి.
ఈ క్రమంలో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురైన రవి మంగళవారం సాయత్రం తన పొలం వద్ద పురుగుల మందు తాగి ఇంటికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య వినోద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇద్దరు రైతుల ప్రాణం తీసిన అప్పు
Published Thu, Mar 1 2018 6:59 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
బెంగాల్ గవర్నర్పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Pooja Hegde: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement