హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవం | Three People Get Life Prison In Murder Case | Sakshi
Sakshi News home page

హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవం

Jun 30 2018 9:55 AM | Updated on Jun 30 2018 9:57 AM

Three People Get Life Prison In Murder Case - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తూప్రాన్‌ : యువకుడిని హత్య చేసిన ముగ్గురు నిందితులకు సిద్దిపేట జిల్లా కోర్టు న్యాయమూర్తి బి.ప్రతిమ శుక్రవారం యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ. 6 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు తూప్రాన్‌ ఎస్‌ఐ నాగార్జునగౌడ్‌ శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.

2015 మార్చి 24న కామారెడ్డి జిల్లా బిక్‌నూరు మండలం బస్వాపూర్‌ గ్రామానికి చెందిన తుడుం స్వామి, క్యాస్థి ప్రశాంత్, నెమలిగారి నవీన్‌ అనే ముగ్గురు వ్యక్తులు అదే గ్రామానికి చెందిన కిరణ్‌ అనే యువకుడిని కిడ్నాప్‌ చేశారు. అనంతరం ఆ కిరణ్‌ను తూప్రాన్‌లోని పెద్ద చెరువు వద్దకు తీసుకువచ్చి హత్య చేసి దాంట్లో పడవేశారు.

అప్పట్లో ముగ్గురు నిందితులను గుర్తించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం కేసుకు సంబంధించి ప్రభుత్వ న్యాయవాది కేసును వాదించగా న్యాయమూర్తి బి.ప్రతిమ యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.6వేల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement