నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం | Three killed as RTC bus hits bike In Nalgonda district | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్‌, ముగ్గురు మృతి

Feb 13 2020 2:27 PM | Updated on Feb 13 2020 3:41 PM

Three killed as RTC bus hits bike In Nalgonda district - Sakshi

సాక్షి, చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు... టీవీఎస్ వాహనాన్ని వెనకనుంచి ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామానికి చెందిన వీరు చిట్యాల శివారులోని వివాహా వేడుకకు హాజరయ్యేందుకు వస్తుండగా వెనుక నుండి కొత్తగూడెం నుండి  హైదరాబాద్ వెళ్తున్న  TS28 Z 0067 సూపర్ లగ్జరీ బస్సు ఢీ కొట్టింది. 

ఈ ప్రమాదంలో దండు మల్కాపురం గ్రామానికి చెందిన బిక్షపతి, చెన్నారెడ్డి గూడెంకు చెందిన నరసింహ అక్కడికక్కడే మృతి చెందారు. పెళ్లి జరుగుతున్న ఫంక్షన్ హాల్‌కు మరికాసేపట్లో చేరుకునే లోపే ఘటన జరగడంతో పెళ్లి మండపంలో విషాదం చోటు చేసుకుంది. సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement