జాతరకు వచ్చి తిరిగిరాని లోకాలకు.. | Tenth Student Died in Water Tank YSR Kadapa | Sakshi
Sakshi News home page

జాతరకు వచ్చి తిరిగిరాని లోకాలకు..

Jun 7 2019 12:42 PM | Updated on Jun 7 2019 12:42 PM

Tenth Student Died in Water Tank YSR Kadapa - Sakshi

భరత్‌ మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లి

వైఎస్‌ఆర్‌ జిల్లా,గాలివీడు : మండలంలోని కొండ్రెడ్డిగారిపల్లె సమీపంలో ఓ రైతు ఏర్పాటు చేసుకున్న నీటి తొట్టిలో మునిగి గురువారం ఉదయం భరత్‌ (15) అనే విద్యార్థి మృత్యువాత పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. నూలివీడు గ్రామంలో బుధ, గురువారాల్లో శ్రీ రేణుకాయల్లమ్మ జాతరను నిర్వహించారు. ఈ సందర్భంగా మదనపల్లెకు చెందిన విద్యార్థి భరత్‌ నూలివీడు పంచాయతీ నల్లాబత్తినవాండ్లపల్లెకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు శ్రీరాములు ఇంటికి వచ్చాడు. రైతు ఏర్పాటు చేసుకున్న నీటితొట్టిలో ఈత కొడుతూ ఆకస్మికంగా మునిగి మృత్యువాత పడ్డాడు. భరత్‌ ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో 9.5 జీపీఏ సాధించాడు. బంధువుల ఇంటికి వచ్చి కొడుకును కోల్పోయామని భరత్‌ తల్లిదండ్రులు బోరున విలపించారు. సంఘటనను చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement