తుళ్లూరు (తాడికొండ) : రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలంలో టీడీపీ వర్గీయులు రాక్షసంగా ప్రవర్తించారు. నెక్కల్లు గ్రామంలో నడకదారి విషయమై ఏర్పడిన వివాదంలో న్యాయం కోసం పోలీసుస్టేషన్కు వెళుతున్న బీసీలను కారుతో తొక్కించేశారు. ప్రమాదంలో ఒక వృద్ధురాలు మృతిచెందగా మరో ఏడుగురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలో పసుపులేటి భూపతిరావు, ఆలూరి బ్రహ్మయ్య ఇళ్ల మధ్య నడిచే దారి విషయంలో వివాదం చెలరేగింది. బీసీలైన భూపతిరావు, అక్కడున్న మహిళలను టీడీపీకి చెందిన ఆలూరి బ్రహ్మయ్య దుర్భాషలాడి మహిళలపై దాడి చేశారు. బాధితులు తుళ్లూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి బయలుదేరారు.
రోడ్డుపక్కనున్న వారిపైకి కారు నడిపి..
పోలీసు స్టేషన్కు వెళ్లేందుకు రోడ్డు మీద ఆటోకోసం ఎదురుచూస్తున్న వారి మీదుగా ఆలూరు బ్రహ్మయ్య కొడుకు ఆలూరు సుధాకర్బాబు కారు నడిపి తొక్కించేశాడు. ఆ సమయంలో కారులో బ్రహ్మయ్య, అతడి మరో కుమారుడు ఆలూరి అజయ్, వారి బంధువు యర్రమాసు శ్రీనివాసరావు ఉన్నారు. కారు కింద నలిగి తీవ్రంగా గాయపడిన ఎనిమిది మందిని స్థానికులు గుంటూరు జీజీహెచ్కు తరలించారు. వీరిలో పసుపులేటి మహాలక్ష్మి (65) మృతి చెందింది. వీరమ్మ, పసుపులేటి కాటరాలు, పసుపులేటి బ్రహ్మయ్య, పసుపులేటి బాపయ్య, పసుపులేటి శిరీష, పసుపులేటి పిచ్చయ్య, వెంకటలక్ష్మి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ దారుణంపై తుళ్లూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. తొలుత పరారైన నిందితులు తరువాత పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది.
కారుతో తొక్కించి వృద్ధురాలి హత్య
Published Sat, Apr 6 2019 8:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- Telangana: మరో రెండు రోజులు వానలు
Advertisement