అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి | Suspicious Death Of Young Girl | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి

Aug 29 2018 12:15 PM | Updated on Aug 29 2018 12:15 PM

Suspicious Death Of  Young Girl - Sakshi

సోఫియా మృతదేహం 

చింతకాని ఖమ్మం : మండలంలోని గాంధీనగర్‌కాలనీలో అనుమానాస్పద స్థితిలో మహ్మద్‌ సోఫియా(13) బాలిక సోమవారం రాత్రి మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు... కాలనీకి చెందిన హస్నుజమా, నస్రీన్‌ దంపతుల చిన్న కుమార్తె సోఫియా, ఖమ్మం నగరంలోని పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. ప్రతి రోజు ఇంటి నుంచి పాఠశాలకు బస్సులో ఖమ్మం వెళ్లి వస్తోంది. అనారోగ్యం కారణంగా సోమవారం పాఠశాలకు వెళ్లలేదు. తమ ఇంట్లోని బాత్‌రూంలో రేకుల కోసం ఏర్పాటు చేసిన ఇనుప రాడ్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బయటకు వెళ్లిన తల్లి ఇంటికి వచ్చేసరికి కుమార్తె కన్పించకపోవటంతో బాత్‌రూం వద్దకు వెళ్లి చూసింది. వెంటనే చుట్టుపక్కల వారి సహాయంతో కిందకు దించి, స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లింది. అప్పటికే మృతిచెందినట్టుగా ఆ ఆర్‌ఎంపీ తెలిపారు. 

బాత్‌రూంలో రేకుల కోసం అమర్చిన ఇనుప రాడ్‌ ఎత్తు ఆరు అడుగులు ఉంది. రాడ్‌కు కట్టిన చున్నీ నాలుగున్నర అడుగుల కిందకు వేలాడి ఉంది. దీంతో, బాలిక మృతిపై (ఆత్మహత్యపై) స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్తకు దూరంగా నస్రీన్‌ ఉంటోంది. ఆ దంపతులకు ఐదుగురు పిల్లలు. ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. గతంలో రెండవ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నస్రీన్‌ ఫిర్యా దుతో ఎస్సై మొగిలి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement