చెరువులో దూకి విద్యార్థిని ఆత్మహత్య | Student Comitted Suicide By Jumping Into Pond In Keesara | Sakshi
Sakshi News home page

చెరువులో దూకి విద్యార్థిని ఆత్మహత్య

Sep 6 2018 12:22 PM | Updated on Nov 9 2018 5:06 PM

Student Comitted Suicide By Jumping Into Pond In Keesara - Sakshi

మృతురాలు సోనీ

ఓ విషయంలో తండ్రి మందలించాడని మనస్తాపం చెంది..ఐ యామ్‌ గోయింగ్‌ టు డై అని స్నేహితురాలికి మెసేజ్‌ పెట్టి ఆత్మహత్య చేసుకుంది.

మేడ్చల్‌: కీసర మండలం చీర్యాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో నివాసముంటున్న నిత్యానంద్‌ కుమార్తె సోనీ(24) ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామ సమీపంలోని చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఓ విషయంలో తండ్రి మందలించాడని మనస్తాపం చెంది..ఐ యామ్‌ గోయింగ్‌ టు డై అని స్నేహితురాలికి మెసేజ్‌ పెట్టి ఆత్మహత్య చేసుకుంది. నిన్న ఉదయం కాలేజీకి వచ్చి బ్యాగ్‌ను కాలేజీలోనే సోనీ వదిలి వెళ్లిపోయింది. సోనీ, స్వగ్రామంలోని గీతాంజలి కాలేజీలో బీ ఫార్మసీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement