ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి

Seven Killed In Road Accident At Siwan District Bihar - Sakshi

పట్నా: బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో ఉన్న మిని వ్యాన్‌ను.. వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు ఢీ కోన్న ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఈ ఘటన సివాన్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడినవారిని సివాన్‌ సర్దార్‌ ఆస్పత్రికి తరలించారు.  కాగా, బాధితులు ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ట్రక్కు అధిక వేగంతో దూసుకురావడం వల్ల ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top