ఇజ్రాయెల్‌లో సాయుధుడి కాల్పుల కలకలం | security personal died in armed man attack | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌లో సాయుధుడి కాల్పుల కలకలం

Sep 26 2017 12:47 PM | Updated on Aug 21 2018 3:16 PM

security personal died in armed man attack - Sakshi

జెరుసలేం: ఇజ్రాయెల్‌లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. పాలస్తీనాకు చెందిన ఓ గుర్తుతెలియని దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. జెరుసలేం శివారులోని వెస్ట్‌బ్యాంక్‌లో ఈ విషాదం చోటుకేసుకుంది. మృతులు సెక్యూరిటీ గార్డులని సమాచారం. ఈ విషయాన్ని జెరుసలేం అధికారులు వెల్లడించారు. స్థానిక వెస్ట్‌బ్యాంక్‌లోని సెటిల్మెంట్‌ ప్రదేశంలోకి ఓ సాయుధుడు ప్రవేశించాడు. అక్కడ తనకు కనిపించిన భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపి.. పరారయ్యేందుకు యత్నించాడు. సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడు గాయపడ్డట్లు తెలుస్తోంది. దుండగుడి కాల్పుల్లో ముగ్గురు సిబ్బంది చనిపోగా, మరికొందరు గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement