కారులోని రూ.5.36 లక్షలు అపహరణ
సాక్షి, తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలోని ఎమ్డీవో కార్యాలయం వద్ద చోరీ జరిగింది. జగ్గరగుంటపాలెం పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ కారులో బుధవారం ఎండీఓ కార్యాలయానికి వచ్చాడు. కారును కార్యాలయం ముందు పార్కు చేసి సంతకం పెట్టేందుకు లోపలికి వెళ్లాడు. తిరిగొచ్చేసరికి కారులో ఉన్న రూ.5.36 లక్షలు అపహరణకు గురయ్యాయి. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.