రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం | Road Accident In Kurnool | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

Jul 5 2018 6:48 AM | Updated on Aug 30 2018 4:17 PM

Road Accident In Kurnool - Sakshi

మృతి చెందిన బెస్త శ్రీనివాసులు

వెల్దుర్తి: పట్టణ సమీపంలోని ఎన్‌హెచ్‌ 44పై కర్నూలు క్రాస్‌ వద్ద రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.  మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు..  అనంతపురం జిల్లా కసాపురం ఆంజనేయస్వామి ఆలయంలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్న బెస్త శ్రీనివాసులు(45), చాకలి రంగస్వామి అలంపూర్‌ జోగులాంబ ఆలయానికి పల్సర్‌ బైక్‌పై బయలు దేరారు. రిటైర్డ్‌ ఎస్‌ఐ ఉమాపతి కర్నూలు వెళ్లేందుకు వెల్దుర్తి  క్రాస్‌ వద్ద హైవేపైకి అకస్మాత్తుగా వచ్చాడు.

ఈక్రమంలో రెండు బైక్‌లు వేగంగా ఢీకొన్నాయి. ఘటనలో బెస్త శ్రీనివాసులు, చాకలి రంగస్వామిలకు తీవ్ర గాయాలయ్యాయి. రిటైర్డ్‌ ఎస్‌ఐ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు, స్థానికులు వారిని 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో బెస్త శ్రీనివాసులు మరణించినట్లు కర్నూలు ఆసుపత్రి డాక్టర్లు ధ్రువీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement