
జడ్చర్ల టౌన్: ఓ ఆర్టీసీ బస్సుకు ప్రమాదవశాత్తు టైరు ఊడిపోయింది. ఈ సంఘటన జడ్చర్లలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. టైరు ఊడిన సమయంలో రోడ్డుపై జనసంచారం, వాహన రాకపోకలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం.. వనపర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ప్రైవేట్ బస్సు ముందు టైర్ ఊడిపోయింది. టైర్ ఊడిపోవడంతో బస్సు రోడ్డుపైనే ముందుకు వెళ్లలేకుండా కూలబడింది. బస్సు వేగం తక్కువగా ఉండటంతో అక్కడే ఆగిపోయింది.
ఈ సమయంలో రోడ్డుపై జనసంచారం లేకపోవడంతో ఎవరికీ ప్రమాదం జరగలేదు. వాహనాలు సైతం రాకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికులు కుదుపునకు గురైనప్పటికీ ఎలాంటి రక్తగాయాలు కాలేదు. దీంతో డ్రైవర్, కండక్టర్ ప్రయాణికులను వేరే బస్సుల్లో హైదరాబాద్కు పంపించారు. రాత్రికి మెకానిక్లను పిలిచి మరమ్మతు చేయించుకుని బస్సును తిరిగి వనపర్తికి తీసుకెళ్లారు.