పోలీసుల కూంబింగ్.. రెచ్చిపోయిన స్మగ్లర్లు | Sakshi
Sakshi News home page

పోలీసుల కూంబింగ్ .. రెచ్చిపోయిన స్మగ్లర్లు

Published Fri, Dec 22 2017 12:31 PM

Police Cumbing in Chittoor District

సాక్షి, చిత్తూరు: చిత్తూరు జ్లిలాలో ఎర్రచందనం స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. జిల్లాలోని చంద్రగిరి మండలం మొరవపల్లి వద్ద శుక్రవారం పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. పోలీసులు కూంబింగ్‌లో ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, స్మగ్లర్లు పోలీసులపై రాళ్లు విసిరి అక్కడ నుంచి పరారయ్యారు. దీంతో వారి కోసం పోలీసులు పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు. సంఘటనా స్థలంలో 20 ఎర్రచందన దుంగలు, వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement