మిక్సీలో బంగారం దాచి అడ్డంగా దొరికిపోయాడు..!

Passenger Conceals Gold In Mixer Grinder - Sakshi

సాక్షి, శంషాబాద్‌: మిక్సీలో 1,725 గ్రాముల బంగారాన్ని దాచి దుబాయ్‌ నుంచి తీసుకొచ్చిన ప్రయాణికుడిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకుని, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం దుబాయ్‌ నుంచి వచ్చిన విమానంలో ఓ ప్రయాణికుడు మిక్సీని తెచ్చాడు. అనుమానం వచ్చిన అధికారులు మిక్సీ విడి భాగాలను వేరుచేసి పరిశీలించగా 1,725 గ్రాములు బంగారం బయటపడింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top