ఆన్‌లైన్‌ మోసం | Online Fraud | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ మోసం

Apr 24 2018 11:58 AM | Updated on Sep 2 2018 4:52 PM

Online Fraud - Sakshi

పార్సెల్‌లో ఉన్న నాణ్యత లేని రాగి బొమ్మలు 

వజ్రపుకొత్తూరు రూరల్‌ : ఆన్‌లైన్‌ మోసాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మండల కేంద్రం  వజ్రపుకొత్తూరులో సోమవారం ఇలాంటి మోసం వెలుగు చూసింది. ఇదే గ్రామానికి చెందిన దువ్వాడ ఉమామమేశ్వరరావు సెల్‌ ఫోన్‌కు మీరు లక్కీ డ్రాలో రూ. 9 వేల విలువ గల శాంసాంగ్‌ మొబైల్‌ రూ.1600లకే దక్కించుకున్నారని ఆశ చూపడంతో అతని మిత్రుడు కొయిరి పాపారావు ఈ నగదును సదరు అడ్రాస్‌కు వారం రోజుల క్రితం పంపించారు. 

కాగా సోమవారం తన ఇంటికి వచ్చిన పార్సెల్‌ను విప్పి చూడగా దానిలో నాణ్యత లేని రాగి బొమ్మలు దర్శనం ఇవ్వడంతో వారు కంగుతిన్నారు. తాము నగదు చెల్లించి మోసపోయామని గుర్తించారు. అయితే తక్కువ నగదుతో సరిపోయిందని లేదంటే అధిక మొత్తంలో నగదు చెల్లించి ఉంటే పరిస్థితిని ఊహించి ఆందోళన చెందినట్టు బాధితుడు పాపారావు విలేకరుల ముందు వాపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement