జీపు, బైక్‌ ఢీ: ఒకరు మృతి

one killed in road accident - Sakshi

సాక్షి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాజన్న గుడి చెరువు కట్ట కింది బస్టాండ్ సమీపంలో తుఫాన్‌ జీపు, బైక్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని లక్క సుజిత్ రెడ్డి(30)గా గుర్తించారు. వాసవి నగర్‌కు చెందిన ఇతని స్వగ్రామం పొత్కపల్లి కాగా వేములవాడలో డీసీఎం వ్యాన్ డ్రైవర్‌గా ఉపాధి పొందుతూ పదేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top