నవ వరుడి ఆత్మహత్య

New Bride Groom Comitted Suicide In Secunderabad - Sakshi

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ పరిధిలోని మారేడుపల్లిలో కొత్తగా పెళ్లైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్పుడూ వాట్సప్‌లో చాటింగ్‌తో బిజీగా ఉంటున్నావని ఇటీవల అతని భార్య మందలించింది. ఈ విషయం గురించి కుటుంబసభ్యులకు చెబుతానని  అనడంతో నవ వరుడు శివకుమార్‌ మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. శివ కుమార్‌కు గత నెల ఆగస్టు 15న వివాహం జరిగింది. ఈ ఘటనతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top