హంతకులను కఠినంగా శిక్షించాలి | Murderers Should Be Strictly Punished ∙ | Sakshi
Sakshi News home page

హంతకులను కఠినంగా శిక్షించాలి

Jun 1 2018 2:53 PM | Updated on Oct 17 2018 6:10 PM

Murderers Should Be Strictly Punished ∙ - Sakshi

మృతుని కుటుంబాన్ని ఓదారుస్తున్న షబ్బీర్‌ అలీ

భిక్కనూరు ఆదిలాబాద్‌ : జంగంపల్లిలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అత్తెల్లి రమేశ్, ముదాం రాములును హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని శాసన మండలి విపక్ష నేత మహ్మద్‌ అలీ షబ్బీర్‌ డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబాలను గురువారం ఆయన పరామర్శించారు.

రాములు కుమార్తె ప్రసన్న బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతుందని తెలుసుకుని ఆమె ఇంజినీరింగ్‌ పూర్తయ్యే వరకు ఖర్చులను భరిస్తానని షబ్బీర్‌అలీ చెప్పారు. అలాగే రమేశ్‌ కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రాములు కుటుంబాన్ని పరామర్శించి రూ.10 వేల ఆర్థికసాయం అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయకులను కిరాతకంగా చంపిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయనడానికి ప్రశాంత గ్రామామైన జంగంపల్లిలో జరిగిన హత్యలే నిదర్శనమన్నారు.

ఆయన వెంట డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఎడ్ల రాజిరెడ్డి, పీసీసీ కార్యదర్శులు నల్లవెల్లి అశోక్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీటీసీ పుల్లూరి బాల్‌నర్సవ్వ, రామస్వామి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు చంద్రకాంత్‌రెడ్డి, నర్సింలుయాదవ్, సుదర్శన్‌ ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement