
లక్నో : ఉత్తర ప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. విష ప్రయోగంతో 100 కోతులు మృతి చెందాయి. అమ్రోహ జిల్లా దబ్రాసి గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ప్రాథమిక విచారణలో అవి విషం కారణంగానే చనిపోయినట్లు తేలింది. అయితే కొందరు గ్రామస్తులు మాత్రం నూడిల్స్ కోసం వాడే చట్నీ తిని అవి చనిపోయినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై అటవీ శాఖ రంగంలోకి దిగింది. పోస్టు మార్టం రిపోర్ట్ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు.