వివాహితపై అత్యాచారం.. అకృత్యాలు సెల్‌ఫోన్‌లో.. | Sakshi
Sakshi News home page

వివాహితపై యువకుడి అత్యాచారం

Published Thu, Oct 4 2018 12:52 PM

Molestation On Woman In Chittoor - Sakshi

చిత్తూరు , కార్వేటినగరం : మండలంలోని గోపిశెట్టిపల్లి దళితవాడలో వివాహితపై అత్యాచారం చేశాడో యువకుడు. రాక్షసంగా ప్రవర్తించడమే కాకుండా, బయటపెడితే చంపేస్తానని బెదిరించాడు. ఎస్‌ఐ శ్రీనివాసరావు కథనం మేరకు వివరాలిలా.. గోపిశెట్టిపల్లి దళితవాడకు చెందిన యువతి(21)కి నాలుగేళ్ల కిందట వెదురుకుప్పం మండలం బొమ్మనదొడ్డి దళితవాడకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వివాహమైన ఆరునెలలకే భర్తకు మతిస్థిమితం లేకుండా ఎటో వెళ్లిపోవడంతో ఆమె తిరిగి పుట్టింటికి చేరుకుంది. పాడిపై ఆధారపడి జీవనం సాగిస్తోంది.

ఆమెకు ప్రస్తుతం నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం సదరు వివాహిత గ్రామ సమీపంలోని పళ్లిపట్టు చెరువులో పశువులను మేపుతుండగా, అదే గ్రామానికి చెందిన గరుణ కుమారుడు పి.పాండియన్‌ వెనుక నుంచి వచ్చి ఆమెను బలవంతంగా పక్కనున్న చెరుకుతోటలోకి లాక్కెళ్లాడు. అత్యాచారం చేసి ఆమె మర్మావయాలపై కొరికి తీవ్రంగా గాయపరిచాడు. ఈ అకృత్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఇకపై తాను పిలిచిన చోటకు రాకపోతే దృశ్యాలను వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో పెడతానని, విషయాన్ని బయటపెడితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement