కరుడుకట్టిన మిలిషియా కమాండర్‌ అరెస్టు

Militia Commander Arrested In East Godavari - Sakshi

సాక్షి, కాకినాడ: తూర్పు మన్యంలో కరుడుకట్టిన మిలిషియా దళ కమాండర్‌ ముచ్చిక లక్ష్మయ్యను గురువారం తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. శబరి దళంలో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లక్ష్మయ్య.. నాలుగు హత్య కేసులతో పాటు 20 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు.

చింతూరు మండలానికి చెందిన 24 ఏళ్ల లక్ష్యయ్య నాలుగేళ్లుగా మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. మరో వైపు కొవ్వాసి దేవమ్మ అనే మావోయిస్టు దళ సభ్యురాలు జిల్లా పోలీసులకు లొంగిపోయింది. జిల్లా సరిహద్దులోని చత్తీస్‌ఘడ్‌ సుకుమా జిల్లాలో  దేవమ్మ మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు ఎస్పీ విశాల్‌ గున్నీ తెలిపారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top