రోడ్డు పనుల వాహనాల కాల్చివేత

Maoists Burned Vehicles In Sukma - Sakshi

మల్కన్‌గిరి :  జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమ జిల్లాలో రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ వాహనాలను మావోయిస్టులు శనివారం  కాల్చివేశారు. సుకుమ జిల్లాలోని రామారామ్‌ బడేష్ఠి గ్రామంలో రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఆ గ్రామానికి వచ్చిన మావోయిస్టులు పనులు జరుగుతున్న చోట సిబ్బందిని కొట్టి పంపించివేసి వాహనాలను కాల్చివేశారు. పొక్లెయిన్లు, మిక్సర్‌ మెషీన్, ట్రాక్టర్‌లకు మావోయిస్టులు పెట్రోల్‌ పోసి నిప్పంచించారు. ఎన్ని సార్లు హెచ్చరించినా రోడ్డు పనులు చేస్తున్నారని, మరోసారి ఈ ప్రాంతంలో రోడ్డు పనులు జరిగితే మరణ దండన విధిస్తామని హెచ్చరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top