ఆవిరైపోయిన ఆశలు | Man Died In College Bus Accident Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఆవిరైపోయిన ఆశలు

Sep 21 2018 6:48 AM | Updated on Sep 24 2018 9:34 AM

Man Died In College Bus Accident Visakhapatnam - Sakshi

రవి మృతదేహం

సాగర్‌నగర్‌(విశాఖ తూర్పు): మా స్నేహితుడి ఇంటికి వెళ్లి మళ్లీ వస్తాను... ఈలోగా బాబును జాగ్రత్తగా చూడు అని చెప్పి వెళ్లి తిరిగిరాని లోకానికి చేరుకున్నావయ్యా... అంటూ మృతుడు రవి భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది. బుధవారం విశాలాక్షినగర్‌ పోలీస్‌క్వార్టర్స్‌ రోడ్డులో కళాశాల బస్సు ఢీకొన్న ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వై.రవి ప్రాణాపాయ స్థితిలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. పొట్ట కూటి కోసం విశాఖ వలసవచ్చి బ్రాండెక్స్‌ కంపెనీలో ఉపాధి పొందుతున్నాడు.

రెండేళ్ల క్రితం వివాహమైంది. గాజువాక ప్రాంతంలో నివాసముంటున్న వై.రవి భార్య విజయ అనారోగ్యం కారణంగా ఆరిలోవలో ఉన్న ఈఎస్‌ఐ ఆస్పత్రికి కుమారుడితో కలిసి బుధవారం తీసుకొచ్చాడు. అక్కడ వైద్య సేవలు పూర్తి చేసుకున్న అనంతరం భార్య విజయను, కుమారుడిని ఆస్పత్రి వద్దే ఉంచి విశాలాక్షినగర్‌లో ఉంటున్న తన స్నేహితుడిని పలకరించడానికి ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈలోగా జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై మృత్యు ఒడిలోకి చేరారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి శవ పంచనామా చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు రవి మృతిదేహాన్ని తరలించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement