హైదరాబాద్‌లో పరువు హత్య | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 30 2018 9:18 AM

Man Dead In Hyderabad Suspected Honor Killing - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని తిరుమలగిరిలో పరువు హత్య చోటు చేసుకుంది. నందకిషోర్‌ అనే వ్యక్తిని భార్య తరపున బంధువులు శనివారం అర్ధరాత్రి దారుణంగా కొట్టి చంపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగేళ్ల క్రితం తిరిమలగిరిలోని టీచర్స్‌ కాలనీకి చెందిన ఓ యువతిని నందకిషోర్‌ ప్రేమ వివాహం చేసుకున్నారు.ఈ వివాహం యువతి కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో పథకం ప్రకారం కిషోర్‌ని హత్య చేశారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.  కేసునమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement