లక్కీ లాటరీ పేర రూ.5 లక్షలకు టోకరా | lucky lottery scam | Sakshi
Sakshi News home page

Dec 9 2017 9:07 AM | Updated on Aug 21 2018 6:21 PM

వేములవాడ: లక్కీ లాటరీ తగిలిందంటూ వచ్చిన ఫోన్‌ కాల్‌కు మోసపోయాడో వ్యక్తి. ఆ అగంతకులు చెప్పిన ప్రకారం కొంత డబ్బు బ్యాంకులో డిపాజిట్‌ చేసి మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మారుపాకలో జరిగింది. ఉత్తర ప్రదేశ్ లక్నో నుంచి లక్కీ లాటరీ తగిలిందంటూ మారుపాకకు చెందిన అంజయ్యకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అది నిజమేనని నమ్మిన ఆయన ఫోన్‌ చేసిన వ్యక్తులు తెలిపినట్లు ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం లక్నోలోని ఓ బ్యాంకు అకౌంట్‌లో రూ.5 లక్షలను జమ చేశాడు. ఎంతకీ లాటరీ డబ్బు రాకపోవడంతో మోసపోయానని తెలుసుకున్న అంజయ్య శనివారం వేములవాడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement