ఒంటరి యువతిని ఇంట్లో బంధించి.. | A lady died while takes to hospital in yadadri | Sakshi
Sakshi News home page

ఒంటరి యువతిని ఇంట్లో బంధించి..

Oct 8 2017 10:39 PM | Updated on Oct 8 2017 10:39 PM

సాక్షి, యాదాద్రి : యాదాద్రి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిని ఇంట్లో బంధించి పురుగుల మందు తాగించడంతో ఆమె మృతిచెందింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం జై కేసారంలో ఓ ఇంట్లోకి కొందరు గుర్తుతెలియని దుండగులు చొరబడ్డారు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని బంధించారు. అంతటితో ఆగని ఆ దుండగులు యువతికి బలవంతంగా పురుగుల మందు తాగించి అక్కడినుంచి పరారైనట్లు సమాచారం. ఇది గమనించిన స్థానికులు యువతిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ఆమె మృతిచెందినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement