యువతి ఆత్మహత్య
కర్ణాటక ,దొడ్డబళ్లాపురం : కోల్కొతాకు చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన అనేకల్ సమీపంలోని గోవిందశెట్టిపాళ్యలో చోటుచేసుకుంది. నెప్ఛ(19) అనే యువతి ఎలక్ట్రానిక్ సిటీలోని సెలూన్లో పనిచేస్తూ గోవిందశెట్టిపాళ్యలో నివసిస్తోంది. బుధవారం సాయంత్రమైనా ఇంటినుంచి బయటకు రాకపోవడంతో స్థానికులు కిటికీ నుంచిచూడగా ఆత్మహత్యా ఘటన వెలుగు చూసింది.పరప్పన అగ్రహార పోలీసులు యువతి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.