రణరంగంలా పోలవరం ప్రాజెక్టు ప్రాంతం

High Tension At Polavaram Project Area - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : పోలవరం ప్రాజెక్టు ప్రాంతం రణరంగంగా మారింది. కార్మికుల భద్రత పట్ల కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కార్మికులు ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం ప్రాజెక్టు స్పీల్వే ప్రాంతంలో పనిచేస్తూ కిందపడిపోయి ఓ కార్మికుడు మృత్యువాత పడ్డాడు. కార్మికుల భద్రత పట్టించుకోకుండా కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. నవయుగ కంపెనీ కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన కార్మికులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఓ కారు అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top