పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు దాడులు నిర్వహించారు.
సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు దాడులు నిర్వహించారు. గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందనే సమాచారంతో వట్లూరు సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తితో పాటు 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరస్టైన వారిలో 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 10.50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని విచారణ చేపడుతున్నారు.