గంజాయి స్వాధీనం..ముగ్గురి అరెస్ట్‌

Ganja Captures In Hyderabad - Sakshi

హైదరాబాద్‌ : మల్కాగిరిరి ఎక్షైజ్ పోలీసులు గంజాయి తరలిస్తున్న ఓ ముఠాను పట్టుకున్నారు. వారి నుంచి రూ.16 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా.. ఓ వ్యక్తి ఎక్సైజ్‌ పోలీసుల రాక గమనించి పరారయ్యాడు. విశాఖపట్నం జిల్లా పాడేరు నుంచి ఈ గంజాయిని హైదరాబాద్‌ మీదుగా ముంబాయి తరలించే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 135 కేజీల గంజాయితో పాటు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top