పంజాగుట్టలో అగ్ని ప్రమాదం

Fire Accident In Wine Shop At Punjagutta - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ క్రైమ్‌ : పంజాగుట్టలోని ఓ వైన్‌ షాపులో సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నిమ్స్‌ హాస్పిటల్‌ దగ్గరలో ఉన్న డ్యూ పాయింట్‌ వైన్స్‌లో ఈ దుర్ఘటన జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. చెలరేగుతున్న మంటలను ఫైర్‌ సిబ్బంది ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సుమారుగా రూ. 25 లక్షల ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియలేదు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top