కన్నతండ్రి కామ పిశాచిగా మారి.. | Father Molestation on Daughter in West Godavari | Sakshi
Sakshi News home page

కూతురిపై తండ్రి అత్యాచారం!

May 22 2020 12:06 PM | Updated on May 22 2020 12:10 PM

Father Molestation on Daughter in West Godavari - Sakshi

పశ్చిమగోదావరి,పెదవేగి: కన్నతండ్రి కామ పిశాచిగా మారి కూతురిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఏలూరు దిశ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏలూరు మహిళా స్టేషను డీఎస్పీ పైడేశ్వరరావు గురువారం తెలిపిన వివరాల ప్రకారం... విజయరాయి గ్రామానికి చెందిన భార్యాభర్తలు గొడవల కారణంగా అదేగ్రామంలో విడివిడిగా ఉంటున్నారు. వారి కుమార్తె (14 ఏళ్లు) తండ్రి వద్దనే ఉంటోంది.  బాలిక తండ్రి కొద్ది రోజులుగా ఆమెపై పలుమర్లు అత్యాచారానికి పాల్పడుతండటంతో మూడు రోజుల క్రితం ఏలూరు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఇంటి నుంచి బయలుదేరింది.

ఏలూరు నగరానికి చెందిన ఓ యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి తనతో తీసుకువెళ్లి రెండు రోజులుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడి అనంతరం బాలికను విజయరాయి గ్రామంలో వదిలివేశాడు. బాలిక తల్లి వద్దకు చేరి విషయం చెప్పడంతో గ్రామస్తులు తండ్రిని నిలదీశారు. దీంతో మనస్తాపం చెంది పురుగు మందు తాగి అస్వస్తతకు గురయ్యాడు. అతన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక తండ్రిపైన, నమ్మించి మోసం చేసిన యువకుడిపైనా కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మాయమాటలు చెప్పిన యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement