పోలీసులపై మందుబాబుల దాడి

Drinkers Attacks On Traffic Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోన్న పోలీసులపై మందుబాబులు దాడిచేశారు.  ఈ సంఘటన చంపాపేటలో జరిగింది. యాకుత్‌పురాకు చెందిన రపూఫ్‌, జహంగీర్‌లను ట్రాఫిక్‌ పోలీసులు ఆపి బ్రీత్‌ అనలైజర్‌ టెస్ట్‌ చేస్తుండగా వారు పోలీసులతో ఘర్షణకు దిగారు. పోలీసుల మీద పడి పిడిగుద్దులు గుప్పించారు. ఈ ఘటనలో విధుల్లో ఉన్న అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌బాబు, హోంగార్డు రాజేశ్వర్‌ సింగ్‌లు గాయపడ్డారు. దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులపై పోలీసులు సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top