జూబ్లీహిల్స్లో మద్యం మత్తులో యువతి వీరంగం
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో పోలీసులు శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో 15 యువతి, యువకులు మద్యం సేవించి వాహనం నడపుతూ దొరికినట్లు చెప్పారు. వీరిలో ఓ యువతి మద్యం మత్తులో వీరంగం సృష్టించింది.
వాహనదారులకు పరీక్షలు నిర్వహిస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ప్రజల మంచికోసమే ప్రభుత్వం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను ఏర్పాటు చేసిందని అధికారులు చెప్పారు. దయచేసి మద్యం సేవించి వాహనం నడపొద్దని కోరారు. పోలీసులకు సహాకారం అందిస్తున్న మీడియాకు కృతజ్ఞతలు తెలియజేశారు.
సంబంధిత వార్తలు