ఆగిఉన్న లారీని ఢీకొట్టిన కారు | Car Accident in Krishna | Sakshi
Sakshi News home page

ఆగిఉన్న లారీని ఢీకొట్టిన కారు

Jan 21 2019 1:05 PM | Updated on Jan 21 2019 1:05 PM

Car Accident in Krishna - Sakshi

కొండపల్లి ఐడీఏ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు

కృష్ణాజిల్లా, ఇబ్రహీంపట్నం (మైలవరం) : రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. 30వ నెంబర్‌ జాతీయ రహదారిపై కొండపల్లి ఐడీఏ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. సేకరించిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా నుంచి విజయవాడ వస్తున్న కారు ఐడీఏ వద్ద ఉన్న జ్యోతి హోటల్‌ సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని వెనుక భాగాన బలంగా డీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. డ్రైవర్‌ రవితో పాటు కారులో ప్రయాణిస్తున్న పద్మ, వంశీ తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 సిబ్బంది గొల్లపూడి సమీపంలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement